Aaditya Thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై శివసేన నేత ఆదిత్య ఠాక్రే మరోసారి భగ్గుమన్నారు. దమ్ముంటే వర్లీ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అలాగే తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని అన్నారు. ఈ సారి గెలుస్తారేమో చూద్దాం అని వ్యాఖ్యానించారు.
- Advertisement -
ఓ కార్యక్రమంలో ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘వర్లీ నియోజకవర్గం నుంచి నేను రాజీనామా చేస్తాను. నాపై పోటీ చేయాలని సీఎం ఏక్నాథ్ షిండేకు సవాల్ విసురుతున్నాను. అలాగే మా నాన్నపై తిరుగుబాటు చేసిన 13 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే సవాల్ విసరుతున్నాను. ఈ సారి ఎలా గెలుస్తారో నేను చూస్తాను’’ అని అన్నారు.
- Advertisement -