BigTV English
Advertisement

Accident in Karnataka: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఆరుగురు దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Accident in Karnataka: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఆరుగురు దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Road accident in Karnataka’s Tumakuru district: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. మరో కారులో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిందని తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


ఈ ప్రమాదంపై ఎస్పీ తుమకూరు అశోక్ కేవీ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: వినాయక చవితి వేడుకలు.. వాట్సాప్‌లో అలా చేశాడని స్కూల్ ప్రిన్సిపల్ అరెస్ట్, ఎక్కడంటే?

ఇదిలా ఉండగా, గత నెలలో కర్ణాటకలోని గడగ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×