E-Paper
Advertisement

Free Bus: ఇక పురుషులకూ ఫ్రీ బస్.. మహిళలకు రూ.2000 వేలు, భలే ఛాన్స్!

Free Bus: ఇక పురుషులకూ ఫ్రీ బస్.. మహిళలకు రూ.2000 వేలు, భలే ఛాన్స్!
Advertisement

AIADMK Manifesto: తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల పేరిట వరాలు కురిపిస్తున్నాయి. ఏఐఏడీఎంకే తొలి దశ మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. ఇందులో మహిళలకు రూ.2,000 ఆర్థికసాయం, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కుల విలక్కు పథకం కింద మహిళలకు ప్రతి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం, సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ ఇల్లం యోజన కింద నిరాశ్రయులకు ఇంటి నిర్మాణం చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. తమ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశామని ఏఐఏడీఎంకే ప్రకటించింది.

ఐదు కీలక హామీలు

Advertisement

అసెంబ్లీ ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోలో ఏఐఏడీఎంకే ఐదు కీలక హామీలను ప్రకటించింది.

మహిళలకు రూ.2000

ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కుల విలక్కు పథకం కింద రేషన్ కార్డులున్న మహిళలకు కుటుంబానికి ఒక్కొక్క చొప్పున నెలకు రూ.2,000 అందించనున్నారు. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం ఆర్థిక సమతుల్యతను తొలగిస్తుందని ఏఐఏడీఎంకే తెలిపింది.

పురుషులకు ఫ్రీ బస్

Advertisement

ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉన్న ఉచిత బస్సు ప్రయాణం ఉండగా..ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఏర్పడితే.. సిటీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు కూడా ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని పేర్కొంది.

అందరికీ ఇండ్లు

అమ్మ ఇల్లం యోజన పథకం కింద… గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి కాంక్రీట్ ఇండ్లు నిర్మిస్తామని ఏఐఏడీఎంకే హామీ ఇచ్చింది. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో సొంత ఇళ్లు లేని వారికి ‘అమ్మ ఇల్లం యోజన’ ద్వారా ఉచితంగా భూమిని కొనుగోలు చేసి అపార్ట్‌మెంట్ ఇళ్లను నిర్మిస్తామని తెలిపింది.

ఉపాధి హామీ పథకం

100 రోజుల ఉపాధి పథకాన్ని 125 రోజులకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ఈ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో పేర్కొంది.

Also Read: తమిళనాడులో రాజకీయాలు పీక్స్.. హింధీ భాష, డీలిమిటేషన్‌లపై ఏకమవుతున్న పార్టీలు

ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ

అమ్మ ద్విచక్ర వాహన పథకం కింద రూ.25,000 సబ్సిడీ అందిస్తామని తెలిపింది. అలాగే 5 లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్ర వాహనాలు అందిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×