Bihar Election Result 2025: బీహార్ లో జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రస్తుతం ఎన్డీయే కూటమి 174 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇందులో బీజేపీ 77, JDU 76 . ఇక MGB 64, RJD-60,కాంగ్రెస్ -15 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. అమౌర్లో 2020 లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్ధి అక్తారుల్ ఇమాన్ ఈసారి లీడ్లో ఉన్నారు.
ప్రస్తుతం NDA భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఎన్నికల లెక్కింపు ఇంకా అనేక రౌండ్లు మిగిలి ఉన్నాయి. పలుచోట్ల మెజారిటీ తక్కువగా ఉండటంతో తుది ఫలితాలు ఎలా ఉంటాయన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.