BigTV English

Akhilesh Yadav: అయోధ్య లైంగిక వేధింపుల ఘటనపై బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: అయోధ్య లైంగిక వేధింపుల ఘటనపై బీజేపీ కుట్ర: అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav:అయోధ్యలో బాలికపై సాముహిక లైంగిక దాడి కేసులో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు కుట్ర రాజకీయాలకు తెరలేపాలని బీజేపీ కోరుకుంటుందని తెలిపారు. తొలి నుంచి సోషలిస్టులు ముఖ్యంగా ముస్లింల పట్ల బీజేపీ వ్యవహారశైలి అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.


ఒక యోగి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకుంటే ఆయన యోగి కాలేరని తెలిపారు. ఇక ఈ ఘటనపై అఖిలేష్ గతంలోనే యోగి సర్కార్‌పై మండిపడ్డారు. సాముహిక లైంగిక దాడిలో బాధితురాలికి రక్షణ కల్పించేలా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని అఖిలేష్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసును బీజేపీ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బాలిక జీవితాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Also Read: సినిమా స్టయిల్‌లో.. 60 కిలోమీటర్ల భారీ ఛేజింగ్, సీఈఓ అరెస్ట్


అంతే కాకుండా కేసు సున్నితత్వం దృష్ట్యా కోర్టు పర్యవేక్షణలో బాలికకు పూర్తి భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని తాను కోరుతున్నానని ఎక్స్ వేధికగా పోస్టు చేశారు. అయోధ్యలో ఇటీవల 12 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి జులై 30 వ తేదీన బేకరీ యజమాని మొయిద్ ఖాన్‌తో పాటు ఉద్యోగి రాజు ఖాన్‌లను పురకలందర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. కాగా నిందితులు ఎస్పీ నేతలు, కార్యకర్తలు కావడంతో వారిని కాపాడేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని కాషాయ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×