Maharashtra: మహారాష్ట్రలోని పుణే నగరంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోలాపూర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ‘ముల్తానీ బేకరీ’ యజమాని సునీల్ మోతీలాల్ సదరాంగని నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. కొన్నేళ్ల క్రితమే ఆయన సోలాపూర్ నుంచి పుణేకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అప్రమత్తమైనా అందని ప్రాణం
అయితే విజాపూర్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న 17 అంతస్తుల భవనంపై సునీల్ అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన పొరుగువారు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు భవన కాపలాదారులకు సమాచారం అందించడంతో, వాచ్మెన్ మరో వ్యక్తితో కలిసి పైకి వెళ్లి ఆయన్ని వారించే ప్రయత్నం చేశారు. వారి మాట విని కిందకు వస్తున్నట్లు నటించిన సునీల్, పదో అంతస్తుకు చేరుకోగానే ‘కారు తాళాలు పైన మర్చిపోయాను’ అని చెప్పి వేగంగా తిరిగి పైకి వెళ్లారు.
క్షణాల్లో జరిగిన ఘోరం
ఆయన వెంటే వాచ్మెన్ పరుగెత్తినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. భవనంపైకి చేరుకున్న వెంటనే సునీల్ ఒక్కసారిగా కిందకు దూకేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలను కొందరు సెల్ఫోన్లో చిత్రీకరించగా, ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సునీల్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అంతటి విజయవంతమైన వ్యాపారవేత్త ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్థికపరమైన కారణాలా లేదా మరేదైనా వ్యక్తిగత ఇబ్బందులా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలోని సోలాపూర్ లో ప్రముఖ బేకరీ ఓనర్ ఆత్మహత్య
17వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన #Multanibakery ఓనర్ #SunilMotilalSadarangani
ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
An entrepreneur and owner of a well-known #Multanibakery sunil motilal died… pic.twitter.com/V7JvIK4Zl5
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2026