E-Paper
Advertisement

Gopichandh -Balakrishna: బడ్జెట్ లోపం.. ఏకంగా కథనే మార్చేసిన గోపీచంద్.. ఏంటి గురూ ఇది!

Gopichandh -Balakrishna: బడ్జెట్ లోపం.. ఏకంగా కథనే మార్చేసిన గోపీచంద్.. ఏంటి గురూ ఇది!
Advertisement

Gopichandh -Balakrishna:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కేటప్పుడు కథకు తగ్గట్టుగా బడ్జెట్ ను కూడా కేటాయించాల్సి ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు కథ డిమాండ్ చేస్తే బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సిన సందర్భాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ కారణంగా ఆచితూచి అడుగులు వేస్తూ నిర్మాతలు ఆ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులకు మంచి విజువల్ వండర్ ను చూపించడానికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే ఈ బడ్జెట్ కారణంగా అప్పుడప్పుడు సినిమాలు కొంతకాలం వాయిదా పడిన విషయం కూడా తెలిసిందే. కానే అదే బడ్జెట్ వల్ల ఆగిపోయిన చిత్రాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఈ బడ్జెట్ కారణంగానే కథనే మార్చేశారు అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే ఇదివరకే గోపీచంద్ మలినేని (Gopichandh malineni), బాలకృష్ణ(Balakrishna ) కాంబినేషన్లో 2024 సంక్రాంతి సందర్భంగా ‘వీరసింహారెడ్డి’ సినిమా వచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘NBK 111’ వర్కింగ్ టైటిల్ తో వెంకట సతీష్ కిలారు(Venkata Sathish khilaru) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మొదట ఒక చారిత్రక కథను అనుకున్నప్పటికీ కేవలం బడ్జెట్ కారణాల వల్లే ఈ కథను వదిలి మరో ఫ్రెష్ కథతో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారట.

మాస్ ఎలిమెంట్స్ తో స్టైలిష్ ఎంటర్టైనర్ గా..

Advertisement

స్టైలిష్ ఎంటర్టైనర్ మూవీ అని చిత్ర బృందం కూడా ప్రకటించింది. బాలయ్య చారిత్రాత్మక చిత్రాలలో చక్కగా ఒదిగిపోయి మరీ నటిస్తారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన వీర సింహారెడ్డి తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో చారిత్రాత్మక సినిమా అని చెప్పడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైజ్మెంట్ ఫీలయ్యారు. అయితే ఇప్పుడు బడ్జెట్ కారణంగా కథనే మార్చేయడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇకపోతే ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

also read:Meher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సింగిల్ క్యారెక్టర్ లో అలరించనున్న బాలయ్య..

Advertisement

పైగా గత చిత్రాల మాదిరి కాకుండా బాలకృష్ణ ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్ లోనే కనిపించనున్నారట. మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో నయనతార (Nayanthara ) హీరోయిన్గా ఎంపికయింది. ఇప్పటికే శ్రీరామరాజ్యం, సింహ, జై సింహ వంటి చిత్రాలలో నటించి ఈ జంట హ్యాట్రిక్ అందుకున్నారు.. ఇప్పుడు ఈ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టారు అని చెప్పాలి. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

బాలకృష్ణ తదుపరి చిత్రాలు..

ఇక బాలకృష్ణ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. మలయాళ చిత్రం మార్క్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ హనీఫ్ అదేనీతో ఒక సినిమా చేస్తున్నారు. దీనిని దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయ, కొరటాల శివ వంటి డైరెక్టర్లను బాలయ్య లైన్లో పెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా 65 సంవత్సరాల వయసులో కూడా జెడ్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×