E-Paper
Advertisement

Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న కీలక విచారణ చేపట్టింది. 2025 నవంబర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీస్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని, మహిళా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార యంత్రాంగం నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్నికలను రద్దు చేయాలని జన సురాజ్ పార్టీ కోరింది. అయితే, ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో పార్టీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

ఎన్నికల షెడ్యూల్ వెలువడి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమల్లో ఉన్న సమయంలో బీహార్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ (MMRY) కింద మహిళా ఓటర్ల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున నగదు బదిలీ చేసిందని ప్రశాంత్ కిశోర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సుమారు 35 లక్షల మంది మహిళలకు ఈ విధంగా నగదు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇది ఎన్నికల అక్రమమేనని వాదించారు. దాదాపు ₹15,600 కోట్ల రూపాయలను ఎన్నికల ముందు ఉచితాలుగా పంచడం వల్ల రాజకీయ పార్టీల మధ్య సమాన అవకాశాలులేకుండా పోయాయని ఫిర్యాదు చేశారు.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జన సురాజ్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత, ప్రజాదరణ పొందేందుకు న్యాయస్థానాలను వేదికగా ఉపయోగిస్తారా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మొత్తం రాష్ట్ర ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరడం సరైన విధానం కాదని హితవు పలికింది. ఉచితాల పంపిణీ అనేది తీవ్రమైన అంశమే అయినప్పటికీ, ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని పార్టీ ఈ విషయాన్ని కోర్టుకు తీసుకురావడంపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.

అయితే ఈ అంశం కేవలం బీహార్ రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి, ఈ ఫిర్యాదును పాట్నా హైకోర్టులో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను రద్దు చేయాలని కోరే బదులు, నిర్దిష్టమైన నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలపై ఎలక్షన్ పిటిషన్ వేయాలని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు విముఖత చూపడంతో జన సురాజ్ పార్టీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. 2025 బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాలతో విజయం సాధించగా, ఇండియా కూటమి 35 స్థానాలను గెలుచుకుంది. జన సురాజ్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

Read Also: MLA defection case: ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్.. మూడు వారాలు వెనక్కి.. న్యాయస్థానంలో ఏం జరిగింది?

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×