E-Paper
Advertisement

లీటర్ పెట్రోల్ రూ. 84కే ఇవ్వాలి! E20 వివాదంపై కేజ్రీవాల్ సంచలన డిమాండ్లు

లీటర్ పెట్రోల్ రూ. 84కే ఇవ్వాలి!  E20 వివాదంపై కేజ్రీవాల్ సంచలన డిమాండ్లు
Advertisement

Arvind Kejriwal: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి నిరసనగా ఢిల్లీలో ఆయన అధ్యక్షతన భారీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా దాదాపు ఆరు లక్షల మందికి పైగా హాజరవడం విశేషం. E20 పెట్రోల్‌ను వ్యతిరేకిస్తూ సేకరించిన రెండు లక్షల సంతకాల పిటిషన్‌ను వచ్చే మంగళవారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

E20తో వాహనదారులకు నష్టం

Advertisement

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ పడిపోవడమే కాకుండా ఇంజిన్లు కూడా పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దీనిపై ప్రభుత్వం నిర్వహించిన అధ్యయన నివేదికలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మోదీ, నితిన్ గడ్కరీతో పాటు అమెరికా ట్రేడ్ డీల్స్ ప్రయోజనాల కోసమే దేశ ప్రజలపై ఈ ఇథనాల్ విధానాన్ని రుద్దుతున్నారని ఆరోపించారు. ఎవరూ భయపడకుండా E20కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వానికి AAP పెట్టిన 3 డిమాండ్లు

Advertisement

ప్రశ్నించే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై కేజ్రీవాల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేము చదువుకున్న వాళ్లం, మా డిగ్రీలు అసలైనవి’ అని వ్యాఖ్యానించిన ఆయన, పెట్రోల్-డీజిల్ వాహనాలు కొనడం ఆపి, ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందు ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచారు.

ప్రతి పెట్రోల్ బంకులో సాధారణ పెట్రోల్ లేదా E20 పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటు వినియోగదారుడికి ఉండాలన్నారు. ప్యూర్ పెట్రోల్‌తో పోలిస్తే E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని.. పెట్రోల్ లీటర్ ధరను రూ. 84కు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Also Read: ఇక ఆగేదే లేదు.. అభివృద్ధిలో తెలంగాణ సరికొత్త రికార్డు!

Tags

Related News

కాక్రోచ్‌లకు మద్దతు ఇస్తే.. రూ.80 వేలు, ఆధారాలు సేకరించిన పోలీసులు

కశ్మీర్‌లో ఘోరం.. పేరు అడిగి మరీ కాల్చిచంపిన ఉగ్రవాదులు.. మండిపడిన కాంగ్రెస్ అగ్రనేతలు!

‘నా వయసు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. మోదీ విషయంలో యువతి యూటర్న్!

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ ధరలు భారీగా తగ్గింపు!

పేపర్ లీకేజీకి పాల్పడితే మీ జీవితం క్లోజ్.. 2026 కొత్త చట్టం తెచ్చిన మార్పులివే!

నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!

అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఇంతమంది భారతీయులు చనిపోయారా?

Big Stories

Advertisement
×