AI Photo Trend: సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఓక సంఘటన లేదా ఓ కొత్త వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఓ సరదా 45 ఏళ్ల క్రితం నాటి పాత జ్జాపకాలను గుర్తు చేసుకునేలా చేసింది. అసలు ఆ సంఘటన ఎంటో చెబితే మీరు షాక్లోకి వెల్లిపోతారేమో.. అసలు నమ్ముతారో లేదో చూడాలి. ఇక విషయానికి వస్తే.. ప్రస్థుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ పాత కాలంనాటి ఫోటోలకు ఇప్పటి ఫోటోలను పెట్టి ఎడిట్ చేస్తున్నాము. దీంతో ఈ ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ట్రెండింగ్ ఏఐ ఫోటోలతో ఓ మహిళకు ఊహించని సంఘటన ఎదురైంది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెలితే 1980 కాలంలో ఉజ్జయినిలోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి ఓ యువతి షాపు సిబ్బంది కల్లుగప్పి ఒక బంగారు గొలుసును దొంగిలించింది. దీంతో ఆ భాదితులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఆ మహికోసం గాలింపు చర్యలు చేపట్టినా దోరక లేదు. దీంతో ఆ మహిళ తమ పేరు మార్చుకుని వేరోక ప్రాంతంలో జీవనం సాగించింది. పోలీసులు సైతం కేసును పక్కన పెట్టారు.
Also read: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!
అయితే ప్రస్ధుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఏఐ ఫోటోలు మహిళను పట్టించాయి. అదెలా అంటే.. అందరిలాగే సదరు మహిళ ఈ పాత ట్రెండ్ ఫోటోలను ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ మహిళ పోస్టు కాస్త దుకాణ యజమాని కంటిలో పడింది. దీంతో ఫోటోను పరిశీలించిన దుకాణా దారుడు ముఖ పోలికలను నిశితంగా పరిశీలించి ఆనాడు చోరి చేసిన మహిళ ఈమెనని గుర్తుపట్టాడు. దీంతో అతడు వెంటనే పోలీసులు ఆశ్రయించి వివరాలు సేకరించారు. పోలీసులు షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగి మహిళ వద్దకు పోలీసులు చేరుకుని విచారించారు. పోలీసుల విచారణలో సదరు మహిళ తప్పును ఓప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేవలం సరదా కోసం చేసిన పోస్ట్ కాస్తా గడచిన 45 ఎళ్లనాటి దొంగను పట్టించడంతో అందరూ షాకయ్యారు.
Also read: ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్