Telangana Economy: డిసెంబర్ 2023 నుండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో శరవేగంగా దూసుకుపోతోంది. సరైన ప్రణాళికలు, సమర్థవంతమైన పాలనతో దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. పారదర్శక విధానాలు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలను తాకుతోంది.
తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు
ఆర్థిక పురోగతికి నిజమైన కొలమానం ప్రజల రాబడి పెరగడమే. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా రూ. 4,18,931కి చేరింది. కేవలం ఒకే ఏడాది వ్యవధిలోనే రూ. 38,900 పెరగడం, ఏకంగా 10.23% వృద్ధి రేటును నమోదు చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి, పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతున్నదనడానికి స్పష్టమైన నిదర్శనం.
పెట్టుబడులు, ఉపాధి.. ప్రతి ఇంట్లో వెలుగులు
సమగ్రమైన విధానపరమైన నిర్ణయాలు, భారీగా వస్తున్న పెట్టుబడులు, నూతన ఉపాధి అవకాశాల కల్పన రాష్ట్ర వృద్ధికి ఊపిరిపోశాయి. ప్రభుత్వం సాధిస్తున్న ఈ విజయాల ఫలాలు నేరుగా సమాజంలో కీలకమైన మహిళలు, రైతులు, యువతకే చెందుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి లభిస్తున్న ఈ బలమైన మద్దతుతో రానున్న రోజుల్లో తెలంగాణ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: స్పెయిన్లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!