BigTV English

Ayodhya: అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఎప్పుడంటే.. డేట్ ప్రకటించిన అమిత్ షా..

Ayodhya: అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఎప్పుడంటే.. డేట్ ప్రకటించిన అమిత్ షా..

Ayodhya: హిందువులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రాముడిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. అయోధ్యలో రామాలయం. పోరాడి సాధించుకున్న ఆలయం. నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 1800 కోట్ల ఖర్చుతో.. 3 అంతస్తుల్లో, 5 మండపాలుగా ఆలయాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. హిందువులంతా గర్వపడేలా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఆ డిజైన్లు.. సుందర శిల్పాలు.. పచ్చదనం.. అంతా అద్భుతం.


ఇంతకీ, ఆ అయోధ్య రాముడి దేవాలయాన్ని ఎప్పుడు ఆరంభిస్తారు? రాములోరి దర్శన భాగ్యం ఎప్పటి నుంచి కలుగుతుంది? అనే ఉత్కంఠకు తెరదించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆలయ నిర్మాణం పూర్తయ్యే సమయం వెల్లడించారు.

వచ్చే ఏడాది జనవరి 1నాటికి ఆలయం సిద్ధమవుతుందని అమిత్ షా ప్రకటించారు. త్రిపుర పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి గురువారం ఓ సభలో ప్రసంగిస్తూ.. “రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్.. కోర్టుల్లో నాన్చింది. కానీ, సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ పనులను ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 1 నాటికి ఆలయం సిద్ధమువుతుంది” అని అమిత్ షా చెప్పారు. అంటే, నెక్ట్స్ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి భక్తులను అనుమతిస్తారని తెలుస్తోంది.


Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×