E-Paper
Advertisement

Ayodhya: అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఎప్పుడంటే.. డేట్ ప్రకటించిన అమిత్ షా..

Ayodhya: అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఎప్పుడంటే.. డేట్ ప్రకటించిన అమిత్ షా..

Ayodhya: హిందువులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రాముడిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. అయోధ్యలో రామాలయం. పోరాడి సాధించుకున్న ఆలయం. నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 1800 కోట్ల ఖర్చుతో.. 3 అంతస్తుల్లో, 5 మండపాలుగా ఆలయాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. హిందువులంతా గర్వపడేలా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఆ డిజైన్లు.. సుందర శిల్పాలు.. పచ్చదనం.. అంతా అద్భుతం.

ఇంతకీ, ఆ అయోధ్య రాముడి దేవాలయాన్ని ఎప్పుడు ఆరంభిస్తారు? రాములోరి దర్శన భాగ్యం ఎప్పటి నుంచి కలుగుతుంది? అనే ఉత్కంఠకు తెరదించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆలయ నిర్మాణం పూర్తయ్యే సమయం వెల్లడించారు.

వచ్చే ఏడాది జనవరి 1నాటికి ఆలయం సిద్ధమవుతుందని అమిత్ షా ప్రకటించారు. త్రిపుర పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి గురువారం ఓ సభలో ప్రసంగిస్తూ.. “రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్.. కోర్టుల్లో నాన్చింది. కానీ, సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ పనులను ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 1 నాటికి ఆలయం సిద్ధమువుతుంది” అని అమిత్ షా చెప్పారు. అంటే, నెక్ట్స్ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి భక్తులను అనుమతిస్తారని తెలుస్తోంది.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×