E-Paper
Advertisement

Kuppam: పోలీస్ యాక్షన్.. కుప్పం నేతలపై హత్యాయత్నం కేసులు..

Kuppam: పోలీస్ యాక్షన్.. కుప్పం నేతలపై హత్యాయత్నం కేసులు..
Advertisement

Kuppam: కుప్పం పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు సభలు, ర్యాలీలకు ఇంకా పోలీసుల నుంచి అనుమతి రాలేదు. బాబు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తన ప్రచార రథం తనకు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇక, బుధవారం స్థానిక డీఎస్పీపై చంద్రబాబు కోపంతో ఊగిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సైతం పోలీసులపై విరుచుకుపడ్డారు. పలుచోట్ల తోపులాట, ఘర్షణ జరిగాయి. అదంతా భద్రంగా వీడియో రికార్డ్ చేసిన పోలీసులు.. ఒక్కరోజు ఆగి కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. పలువురు టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సంచలనంగా మారింది.

దాదాపు 50 మందికిపైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

టీడీపీ నేతలపై రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ లో 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. 307, 353 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

శాంతిపురంకు చెందిన టీడీపీ నేతలు.. రాజశేఖర్, నాని, బాబు, లార్డాస్, రాజులపై సెక్షన్ 290, 188, 341 కింద కేసులు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హత్యాయత్నం నమోదు చేశారు.

Advertisement

గొల్లపల్లి క్రాస్ కు దగ్గర జరిగిన ఘటనపై సెక్షన్లు 148, 147, 332, 341, 353, 307r w, 149 కింద కేసులు నమోదు చేశారు. విశ్వనాథ నాయుడు, కేదామత్ ఆంజనేయరెడ్డి, నాగరాజు, ప్రవీణ్, జైపాల్, రమేష్, చంద్రకళ, అనసూయ, సుగుణ తదితరులపై పోలీసు విధులకు ఆటంకం కలిగించి.. సీఐ తులసీరాం, కానిస్టేబుల్ వినోద్ పై దాడి చేశారని కేసులో పొందుపరిచారు.

ఇక పెద్దూరు గ్రామం దగ్గర ఎస్సై సుధాకర్ విధులకు ఆటంకం కలిగించారంటూ.. సెక్షన్లు 341, 353 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద మంజునాథ్, అరణ కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదైన టీడీపీ నేతలందరిపై పక్కా వీడియో ఆధారాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×