E-Paper
Advertisement

Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?

Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?

Sonia Gandhi: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కీలక నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందే ముందు ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరుతూ సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు పంపింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చడంపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ నారంగ్ వాదనలు వినిపిస్తూ, 1980 సంవత్సరంలో ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరును చేర్చడానికి నకిలీ పత్రాలు సృష్టించారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనల నేపథ్యంలోనే ఆమె పేరును అప్పట్లో ఓటర్ల లిస్టు నుంచి తొలగించడం జరిగిందని వివరించారు.

అయితే, తర్వాత మళ్లీ 1983లో సోనియా గాంధీ పేరును ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చడం జరిగిందని న్యాయవాది నారంగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పౌరసత్వం పొందిన అంశం, అలాగే ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చిన ప్రక్రియలపై స్పష్టమైన వివరణ అవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

ఈ పిటిషన్ మరియు వాదనలను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఈ రెండు కీలక అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ: Ind vs SA1st T20I: మ‌రోసారి టాస్ ఓడిన టీమిండియా..గిల్‌, పాండ్యా వ‌చ్చేశారు..ఇక కాటేర‌మ్మ కోత మొద‌లు

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×