Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. మొత్తం 243 శాసనసభ స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు 183 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మహాగఠ్ బంధన్ 57 స్థానాలకు పరిమితం కాగా, ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.
బీహార్ ఎన్నికల ఫలితాల్లో కీలక నేతలు ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్ లో వెనుకబడ్డారు. మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 1273 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ ముందంజలో ఉన్నారు. లఖిసరాయ్ లో బీజేపీ నేత విజయ్ కుమార్ వెనుకంజలో ఉన్నారు. అలీనగర్ లో జానపద గాయని, బీజేపీ నేత మైథిలీ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. మహువాలో జేజేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవన్ వెనుకంజలో ఉన్నారు. తారాపుర్ లో బీజేపీ నేత సామ్రాజ్ చౌదరీ ముందంజలో ఉన్నారు. మొకామాలో జేడీయూ నేత అనంత్ కుమార్ సింగ్ ముందంజలో ఉన్నారు. గయా పట్టణంలో బీజేపీ నేత ప్రేమ్ కుమార్, జముయ్ లో బీజేపీ నేత శ్రేయాసి సింగ్ ముందంజలో ఉన్నారు.
ప్రస్తుతం వెలువడిన ఫలితాల మేరకు బీజేపీ 81, జేడీయూ 75, ఎల్జేపీ(ఆర్వీ) 17, ఆర్జేడీ 39, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీహార్ ఫలితాల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ప్రశాంత్ కిశోర్ జేఎస్పీ 200 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.
Also Read: Bihar Election Result 2025: బీహార్లో రెండు చోట్ల MIM ఆధిక్యం