E-Paper
Advertisement

Bihar Assembly Results: 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు.. బీహార్‌లో సంబరాలకు ఎన్‌డీఏ ఏర్పాట్లు

Bihar Assembly Results: 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు.. బీహార్‌లో సంబరాలకు ఎన్‌డీఏ ఏర్పాట్లు

Bihar Assembly Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రేపు కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్డీఏ శిబిరంలో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. రాజధాని పాట్నా సంబరాలకు సిద్ధమవుతుంది. భారీగా లడ్డూలు తయారీ, విందులకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కృష్ణ సింగ్ కల్లు 500 కేజీల లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ చిత్రాలతో ఉన్న బాక్స్ ల్లో సిద్ధం చేస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ షుగర్ తో స్వీట్లు తయారు చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపే

“ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీహార్ ప్రజలు, పార్టీ కార్యకర్తల కృషికి ప్రతిఫలం” అని కృష్ణ సింగ్ కల్లు అన్నారు. ఈసారి కూడా ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ నేత అనంత్ సింగ్ పాట్నాలో 50,000 మందికి భారీ విందు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇక్కడ ఐదు లక్షల రసగుల్లాలు, గులాబ్ జామున్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేపే కౌంటింగ్

నవంబర్ 14న బీహార్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ విజయం తమదేనని ఎన్డీఏ భాగస్వాములు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పాట్నాలోని పండుగ వాతావరణం ప్రతిబింబిస్తుంది.

Also Read: Bengaluru: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణం: భార్యాభర్తలు, కుమారుడిపైకి కారు ఎక్కించి హల్‌చల్

ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు ఆహ్వానాలు అందుతున్నాయి. జేడీయూ నేత అనంత్ సింగ్ ప్రకటనలు, ఏర్పాట్లతో కార్యకర్తలలో ఉత్సాహం కనిపిస్తుంది. దులార్‌చంద్ హత్య కేసులో అనంత్ సింగ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×