Pune Road Accident: పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుణే-బెంగళూరు హైవే నవలే బ్రిడ్జి సమీపంలో.. సెల్ఫీ పాయింట్ వద్ద ట్రక్కు అదుపు ముందు వెళ్తున్న ఆరు వాహనాలను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రం గాయాలతో రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలో హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.