Bihar Exit Poll: 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బిహార్లో మళ్లీ ఎన్డీయేదే అధికారం అని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించాయి. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ విడుదల చేసిన బీహార్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉంది. మొత్తం 243 స్థానాల్లో, మెజారిటీకి 122 సీట్లు అవసరం కాగా, ఎన్డీఏకు 133 నుంచి 159 సీట్లు దక్కుతాయని అంచనా. మహాఘట్బంధన్ (MGB) 75-101 సీట్లతో రెండో స్థానంలో నిలవనుంది. జేఎస్పీ (JSP) 0-5 సీట్లు, ఇతరులు (OTH) 2-8 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది.
బీహార్ ఎగ్జిట్ పోల్ 2025: వివిధ సంస్థల అంచనాలు
న్యూస్18 ఎగ్జిట్ పోల్ అంచనా:
- ఎన్డీఏ: 140-150
- ఎంజిబి: 85-95
- జెఎస్పి: 0-5
- ఇతరులు: 5-10
‘పీపుల్స్ ఇన్సైట్’ అంచనా:
- ఎన్డీఏ: 133-148
- మహాఘట్బంధన్ (MGB): 87-102
- జేఎస్పీ: 0-2
- ఇతరులు: 3-6
‘మాత్రీ-IANS’ ఎగ్జిట్ పోల్ అంచనా:
- ఎన్డీఏ: 147-167 సీట్లు (తిరిగి అధికారంలోకి)
- మహాఘట్బంధన్: 70-90 సీట్లు
- ఇతరులు: 2-6 సీట్లు
‘టైమ్స్ నౌ జెవిసి’ ఎగ్జిట్ పోల్ అంచనా:
- ఎన్డీఏ: 135- 150
- మహాఘట్బంధన్: 88-103
- ఇతరులు: 3-7
‘చాణక్య’ అంచనా:
- ఎన్డీఏ: 130-138
- మహాఘట్బంధన్: 100-108
- జెఎస్పి: 0
- ఇతరులు: 3-5
‘దైనిక్ భాస్కర్’ అంచనా:
- ఎన్డీఏ: 145-160
- మహాఘట్బంధన్: 73-91
- జెఎస్పి: 0-0
- ఇతరులు: 5-10