BigTV English

Bharat Jodo Nyay Yatra | భారత్ జోడో న్యాయ యాత్రలో హింస.. కీలక నాయకుడి కారుపై బిజేపీ దాడి!

Bharat Jodo Nyay Yatra | కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ల గాంధీ నాయకత్వంలో ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రం ప్రారంభమైంది. ఈ యాత్రలో జనవరి 20 ఆదివారం కాంగ్రెస్ సిబ్బంది, కీలక నాయకుడు జై రామ్ రమేశ్ కారుపై బిజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన అస్సాం లోని సోనిత్‌పూర్ జిల్లాలో జరిగింది.

Bharat Jodo Nyay Yatra | భారత్ జోడో న్యాయ యాత్రలో హింస.. కీలక నాయకుడి కారుపై బిజేపీ దాడి!

Bharat Jodo Nyay Yatra | కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ల గాంధీ నాయకత్వంలో ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రం ప్రారంభమైంది. ఈ యాత్రలో జనవరి 20 ఆదివారం కాంగ్రెస్ సిబ్బంది, కీలక నాయకుడు జై రామ్ రమేశ్ కారుపై బిజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన అస్సాం లోని సోనిత్‌పూర్ జిల్లాలో జరిగింది.


భారత్ జోడో న్యాయ యాత్ర నాలుగవ రోజున రాహుల్ గాంధీ అస్సంలోని బిస్వంత్ జిల్లా నుంచి బయలుదేరి సోనిత్‌పూర్ మీదుగా నాగావ్ చేరుకోవాలి. కాంగ్రెస్ బృందం నాగావ్ జిల్లా చేరుకొని అక్కడ రాహుల్ గాంధీ కలియబోర్‌లో ఒక ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అంతకుముందే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని సమాచారం.

కాంగ్రెస్ నాయకులు కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ వెళ్లే మార్గంలోనే బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆ దారిలో కొందరు కాంగ్రెస్ నాయకుల వాహనాలు జాముగురిహట్ పక్క నుంచి వెళుతుండగా.. కొందరు బీజీపీ కార్యకర్తలు ఆ వాహనాలపై రాళ్లు విసిరారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత జైరామ్ రమేష్ కారు కూడా ఉంది. ఈ దాడిలో కొందరు మీడియా రిపోర్టర్లు కూడా గాయపడ్డారు. బిజేపీ కార్యకర్తలు వారి కెమెరాలు లాక్కొని వాటిని ధ్వంసం చేశారని చెబుతున్నారు.


ఆ తరువాత కూడా బీజేపీ కార్యకర్తలు కార్లపై ఉన్న భారత్ జోడో యాత్ర పోస్టర్లను చింపేశారు. పైగా కార్ల వెనుక భాగంలో బీజేపీ జెండాలను పాతారు.ఇదంతా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఆదేశాలతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.

అయితే ఈ ఘటనపై విచారణ చేయాలని సిఎం హిమంత రాష్ట్ర డిజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×