BigTV English
Advertisement

Bharat Jodo Nyay Yatra | భారత్ జోడో న్యాయ యాత్రలో హింస.. కీలక నాయకుడి కారుపై బిజేపీ దాడి!

Bharat Jodo Nyay Yatra | కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ల గాంధీ నాయకత్వంలో ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రం ప్రారంభమైంది. ఈ యాత్రలో జనవరి 20 ఆదివారం కాంగ్రెస్ సిబ్బంది, కీలక నాయకుడు జై రామ్ రమేశ్ కారుపై బిజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన అస్సాం లోని సోనిత్‌పూర్ జిల్లాలో జరిగింది.

Bharat Jodo Nyay Yatra | భారత్ జోడో న్యాయ యాత్రలో హింస.. కీలక నాయకుడి కారుపై బిజేపీ దాడి!

Bharat Jodo Nyay Yatra | కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ల గాంధీ నాయకత్వంలో ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రం ప్రారంభమైంది. ఈ యాత్రలో జనవరి 20 ఆదివారం కాంగ్రెస్ సిబ్బంది, కీలక నాయకుడు జై రామ్ రమేశ్ కారుపై బిజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన అస్సాం లోని సోనిత్‌పూర్ జిల్లాలో జరిగింది.


భారత్ జోడో న్యాయ యాత్ర నాలుగవ రోజున రాహుల్ గాంధీ అస్సంలోని బిస్వంత్ జిల్లా నుంచి బయలుదేరి సోనిత్‌పూర్ మీదుగా నాగావ్ చేరుకోవాలి. కాంగ్రెస్ బృందం నాగావ్ జిల్లా చేరుకొని అక్కడ రాహుల్ గాంధీ కలియబోర్‌లో ఒక ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అంతకుముందే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని సమాచారం.

కాంగ్రెస్ నాయకులు కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ వెళ్లే మార్గంలోనే బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆ దారిలో కొందరు కాంగ్రెస్ నాయకుల వాహనాలు జాముగురిహట్ పక్క నుంచి వెళుతుండగా.. కొందరు బీజీపీ కార్యకర్తలు ఆ వాహనాలపై రాళ్లు విసిరారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత జైరామ్ రమేష్ కారు కూడా ఉంది. ఈ దాడిలో కొందరు మీడియా రిపోర్టర్లు కూడా గాయపడ్డారు. బిజేపీ కార్యకర్తలు వారి కెమెరాలు లాక్కొని వాటిని ధ్వంసం చేశారని చెబుతున్నారు.


ఆ తరువాత కూడా బీజేపీ కార్యకర్తలు కార్లపై ఉన్న భారత్ జోడో యాత్ర పోస్టర్లను చింపేశారు. పైగా కార్ల వెనుక భాగంలో బీజేపీ జెండాలను పాతారు.ఇదంతా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఆదేశాలతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.

అయితే ఈ ఘటనపై విచారణ చేయాలని సిఎం హిమంత రాష్ట్ర డిజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×