E-Paper
Advertisement

Gujarat : గుజరాత్‌లో మరిగిపోతున్న మహా సముద్రం.. ఆ ఒక్క చోటే వేడెక్కడానికి కారణం ఏమిటీ?

Gujarat :  గుజరాత్‌లో మరిగిపోతున్న మహా సముద్రం.. ఆ ఒక్క చోటే వేడెక్కడానికి కారణం ఏమిటీ?
Advertisement

Gujarat : గుజరాత్ తీరంలో సముద్రం ఉప్పొంగుతున్నట్లు, మరుగుతున్నట్లు బుడగలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా అధికారులు మత్స్యకారులను అప్రమత్తం చేశారు. స్థానిక జాలర్లు తీసిన వీడియోలలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడం చూడొచ్చు. ఈ వీడియోలపై విపత్తు నిర్వహణ అధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని జాలర్లు కోరుతున్నారు. ఈ అసాధారణమైన పరిస్థితులకు.. సముద్రంలో గ్యాస్ లీకేజీలు, నీటి అడుగునున్న పైప్ లైన్లు పగిలిపోయి ఈ తరహా పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

రద్దీ ప్రాంతంలో వింత పరిస్థితులు

Advertisement

పాల్ఘర్ జిల్లా విపత్తు నిర్వహణ సెల్ అధికారి వివేకానంద కదమ్ స్పందిస్తూ.. “ఈ తరహా సముద్రపు పరిస్థితులు చాలా అసాధారణమైనవి. దీనిని పారిశ్రామిక సంస్థల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. సముద్రంలో బుడగలు వస్తున్న ప్రాంతం రద్దీగా ఉండే సముద్రపు రవాణా మార్గాలు, ప్రధాన ఫిషింగ్ ప్రదేశాలకు సమీపంలో ఉందని తెలిపారు. అలాగే నావిగేషన్ భద్రతపై ఆందోళనను పెంచుతున్నాయి.

వైప్ లైన్ లీకైందా?

ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. దీనిని పరిశీలించడానికి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ టీమ్ ను నియమించింది. సముద్రగర్భం నుంచి సహజ మీథేన్ లీక్ కావడం, టెక్టోనిక్‌గా యాక్టివ్ జోన్‌లలో సర్వసాధారణం లేదా ముంబై హై ఫీల్డ్‌లలో చమురు గ్యాస్ మౌలిక సదుపాయాల నుండి పైప్‌లైన్ లీకై ఇలాంటి సంఘటనలు జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అధికారుల బృందం పరిశీలన

Advertisement

టెక్టోనిక్‌గా అన్ రెస్ట్ లో భాగమైన అరేబియా సముద్ర తీరంలో భాగమైన గుజరాత్ తీరప్రాంతంలో, భూకంప పరిస్థితులు లేదా సముద్రం వేడెక్కుతున్న సంఘటనలు చూడవచ్చు. పాల్ఘర్ అధికారులు ఇండియన్ కోస్ట్ గార్డ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ONGCతో సమన్వయం చేసుకుని ఆన్-సైట్ విశ్లేషణ కోసం సోనార్, గ్యాస్ సెన్సార్‌లు కలిగిన సర్వే నౌకలను మోహరిస్తున్నారు.

నీటి నమూనా

మత్స్యకారులు ఈ ప్రాంతాలను నివారించాలని సూచించారు. 2024లో ఉత్తర సముద్రంలో నీటి అడుగున విస్ఫోటనాలతో ఈ సంఘటనలు ముడిపడి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. భారతదేశ సముద్ర పర్యవేక్షణ కట్టుబడి ఉందని తెలుస్తోంది. హైడ్రోజన్ సల్ఫైడ్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి కరిగిన వాయువులను గుర్తించడానికి నీటి నమూనాను తీసుకోవడానికి నిపుణులు ఎదురుచూస్తున్నారు, అయితే ప్రాథమిక సలహాదారులు నౌకలను దారి మళ్లించమని కోరుతున్నారు.

సముద్రంలో వస్తు్న్న మార్పులు లేదా పారిశ్రామిక పరిస్థితుల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ సముద్ర జలాలపై ఆధారపడిన మత్స్యకార సమాజం.. పరిశోధనలు జరిగేందుకు సహాకరలిస్తున్నారు.

Also Read:  అహ్మదాబాద్ ఫ్లవర్ షో అద్భుతం.. గిన్నిస్ రికార్డుల్లో ‘హ్యాట్రిక్’ కొట్టిన గుజరాత్!

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×