E-Paper
Advertisement

Budget Session 2026: వికసిత భారత్ దిశగా చారిత్రక అడుగు.. మోదీ ప్రసంగం

Budget Session 2026: వికసిత భారత్ దిశగా చారిత్రక అడుగు.. మోదీ ప్రసంగం

Budget Session 2026: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చేసిన ప్రసంగం.. భారతదేశం 2047 నాటికి ‘వికసిత భారత్’గా ఎదగడానికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించింది. అయితే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను 21వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఒక కీలకమైన మైలురాయిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఒక రికార్డు కాగా, ఇది కేవలం అంకెల పద్దు మాత్రమే కాదని, రాబోయే 25 ఏళ్ల అభివృద్ధికి బలమైన పునాది అని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, దేశ ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ సమావేశాలు సాగనున్నాయి.

అంతేకాకుండా ప్రభుత్వ ప్రాధాన్యత కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదని, అది ‘హ్యూమన్ సెంట్రిక్’ అభివృద్ధి అని ప్రధాని నొక్కి చెప్పారు. పేదలు, రైతులు, మహిళలు, యువత వంటి నాలుగు ప్రధాన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక న్యాయంతో కూడిన వృద్ధిని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రభుత్వ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందాలనే ‘లాస్ట్ మైల్ డెలివరీ’ లక్ష్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని, సంస్కరణలు, డిజిటలైజేషన్ ద్వారా దేశం అగ్రగామిగా ఎదుగుతోందని మోదీ వివరించారు. ముఖ్యంగా భారత్–ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) వంటి ఒప్పందాలు మన దేశీయ తయారీదారులకు, మత్స్యకారులకు, సేవా రంగానికి అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తెస్తాయి. 27 ఐరోపా దేశాల మార్కెట్లు భారత ఉత్పత్తులకు తలుపులు తెరవడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆకాంక్షించారు.

ప్రభుత్వం ‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’ అనే నినాదంతో ముందుకు సాగుతోందని, సంస్కరణల వేగం ఏమాత్రం తగ్గకుండా ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ పరుగు తీస్తోందని ప్రధాని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలను వెతకడమే ప్రస్తుత ప్రభుత్వ శైలి అని, ఇది అడ్డంకులను సృష్టించే సమయం కాదు, కేవలం పరిష్కారాలను చూపే సమయమని ఆయన స్పష్టం చేశారు. దేశీయ తయారీదారులు నాణ్యతపై రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: విశాఖ గీతం భూములు వ్యవహారం.. రంగంలోకి వైసీపీ.. ఇకపై తాడో పేడో!

అలాగే పార్లమెంటు సభ్యులందరూ రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం ఏకమవ్వాలని ప్రధాని కోరారు. సభలో చర్చలు అర్థవంతంగా, సానుకూలంగా సాగాలని, ప్రజల ఆశయాలను గౌరవించే విధంగా ప్రతి సభ్యుడు తన బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ బడ్జెట్ సమావేశాలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవి కాబట్టి, భారత్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని ఆయన గుర్తు చేశారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×