Varsha Bollamma: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్న అంటే బుధవారం రోజున నాలుగవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు టి20 లలో విజయం సాధించిన టీమిండియా, నాలుగవ మ్యాచ్ ను కాస్త లైట్ తీసుకుంది. ఇషాన్ కిషన్ లాంటి స్టార్ క్రికెటర్ కు రెస్ట్ ఇవ్వడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో ఈ మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్లను దారుణంగా ట్రోలింగ్ చేసింది టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma). న్యూజిలాండ్ క్రికెటర్లు అందరూ సోదిగాళ్లు అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. మ్యాచ్ జరుగుతుండగానే ఈ పోస్టు పెట్టి వాళ్ళ పరువు తీసింది. దీంతో హీరోయిన్ వర్ష బొలమ్మ ( Varsha Bollamma) చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma) గురించి తెలియని వారు ఉండరు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు ముందుకు దూసుకు వెళ్తున్నారు హీరోయిన్ వర్ష (Varsha Bollamma). 2020 సంవత్సరంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వర్ష, స్వాతిముత్యం స్టాండప్ రాహుల్ జాను చూసి చూడంగానే లాంటి సినిమాలు చేసి అదరగొట్టింది. వాస్తవంగా తెలుగులో చూసి చూడంగానే అనే సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ వర్ష.
ఇటీవల కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ కూడా తీసింది. ఈ సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే అలాంటి హీరోయిన్ వర్ష బొల్లమ్మ, క్రికెట్ విపరీతంగా చూస్తారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ పై కూడా సంచలన పోస్ట్ పెట్టారు హీరోయిన్ వర్ష బొల్లమ్మ. న్యూజిలాండ్ క్రికెటర్లు అందరూ సోది గాళ్లు అంటూ ఇజ్జత్ తీశారు. న్యూజిలాండ్ జట్టులో సోది ( NZ Ish Sodhi) అనే బౌలర్ ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు స్కోర్ బోర్డుపైన రాగానే, ఏంటి సోది, వీళ్లంతా సోదిగాళ్లే అంటూ వర్ష బొల్లమ్మ ట్రోల్ చేశారు. న్యూజిలాండ్ క్రికెటర్ సోది పరువు తీసేలా వర్ష బొల్లమ్మ ఆడుకుంటున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య 5 టీ20 ల సిరీస్ జరుగుతోంది. ఇందులో వరుసగా 3 మ్యాచ్ ల్లో టీమిండియాలో గెలువగా ఒకటి న్యూజిలాండ్ గెలించింది. ఎల్లుండి మరో మ్యాచ్ జరునుంది.
https://www.facebook.com/stories/137974964551662/?view_single=true