E-Paper
Advertisement

ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన నెటిజన్స్, కండక్టర్ సస్పెండ్

ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన నెటిజన్స్, కండక్టర్ సస్పెండ్
Advertisement

Bus Conductor: ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు ప్యాసింజర్. సదరు వ్యక్తిపై కండక్టర్ అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. కాలుతో తన్ని బస్సు నుంచి కిందికి తోసేశాడు.  దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇంటాబయటా విమర్శలు రేగడంతో సదరు కండక్టర్‌ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన బెంగుళూరు సిటీలో వెలుగుచూసింది.

 

బెంగుళూరు సిటీలో షాకింగ్ ఘటన

Advertisement

ప్రయాణికుడిని బస్సు నుండి తోసి వేసిన ఘటన బెంగళూరులో సిటీ తీవ్ర కలకలం రేగడంతో బస్సు కండక్టర్ సస్పెండ్ అయ్యాడు. అతడిపై దాడి చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆర్టీసీ తీరుపై విమర్శలు రేగడంతో పరిస్థితి గమనించిన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్- BMTC అధికారులు సదరు కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు అధికారులు.

 

ప్రయాణికుడిపై కండక్టర్ ప్రతాపం

Advertisement

కర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని ప్రశ్నించేలా జరిగన ఓ ఘటన కలకలం రేపింది. ఆగస్టు 2న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. బస్సులో నుంచి ఆ వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి, కాలుతో బస్సులో నుంచి కిందకు తోసేశాడు సదరు కండక్టర్.

 

సస్పెండ్ చేసిన అధికారులు, విచారణ మొదలు

దారుణ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ, ప్రయాణికులు, సామాన్యులు మొబైల్ కెమెరాల్లో రికార్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. అయితే బాధిత వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవనం సాగించినట్టు తెలుస్తోంది.  నిరాశ్రయుడైన ఓ వ్యక్తి పట్ల రవాణా శాఖ సిబ్బంది క్రూరంగా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

కర్ణాటక రవాణా శాఖ అధికారులు.. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కండక్టర్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కండక్టర్ నుంచి వివరణ తీసుకున్నారు. అలాగే బాధిత వ్యక్తి నుంచి డిజిటల్ సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఆర్టీసీ అధికారులు.

 

 

Related News

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మంది అరెస్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం!

మోదీ వీడియో డిలీట్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన మెటా.. కేంద్రానికి జుకర్‌బర్గ్ సారీ!

విజయ్ మార్క్ బడ్జెట్.. పెళ్లికి బంగారు నాణెం.. పుట్టిన పాపాయికి గోల్డ్ రింగ్!

ప్రధాని మోదీ వీడియో డిలీట్ పై.. క్లారిటీ ఇచ్చిన మెటా సంస్థ..!

సీజేపీ నిరసనల్లో ఉగ్ర కుట్ర.. 9 మంది అరెస్ట్, తీగలాగితే డొంక

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు

Big Stories

Advertisement
×