E-Paper
Advertisement

China: అరుణాచల్ ప్రదేశ్ పై డ్రాగన్ మరో కుట్ర.. 30 ప్రాంతాలకు చైనా పేర్లు..

China: అరుణాచల్ ప్రదేశ్ పై డ్రాగన్ మరో కుట్ర.. 30 ప్రాంతాలకు చైనా పేర్లు..
china news today
China

China arunachal pradesh news(Today’s breaking news in India): చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ పై మరో వివాదాన్ని రేపింది. ఆ రాష్ట్రంలోని 30 ప్రాంతాలు తమ దేశంలో భాగంగా పేర్కొంది. వాటికి పేర్లు కూడా పెట్టేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యం డ్రాగన్ వివాదాలను రేపుతోంది.

చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ లోని 30 ప్రాంతాలకు పేర్లు పెట్టినట్లు ఇటీవల ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. చైనా తమవిగా పేర్కొన్న వాటిలో 11 నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. 12  పర్వతాలు, 4 నదులు, సరస్సు, పర్వత మార్గం, మరో భూభాగం తమవేనని ఆ కథనంలో పేర్కొంది. ఆ 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో పేర్లు పెట్టిందని తెలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని జాంగ్ నన్ ప్రాంతంపై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఈ క్రమంలోనే డ్రాగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాంగ్ నన్ లో 30 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

Also Read:  మావల్లే ఆ విషయం బయటకు.. అది తప్పు..

అరుణాచల్‌ ప్రదేశ్‌  తమ దేశంలో భాగమని డ్రాగన్ చాలాకాలంగా వితండవాదం చేస్తోంది. ఈ క్రమంలో ఆ భూభాగాన్ని జాంగ్‌నన్‌ గా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి.  2017లో  6 ప్రాంతాలకు, 2021లో 15 ప్రాంతాలకు, 2023 ఏప్రిల్‌లో 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వ్యవహార శైలిపై భారత్ అభ్యంతరం తెలిపింది. వాస్తవాలను ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది. పేర్లు పెట్టుకున్న మాత్రాన ఆ ప్రాంతాలు చైనాకి చెందవని తేల్చిచెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని కుండబద్దలు కొట్టింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ పర్యటనపైనా  చైనా అభ్యంతరం తెలిపింది. ఆ సమయంలో కూడా చైనాకు భారత్ ధీటుగా బదులిచ్చింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×