Train Collides: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాంనగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణీకులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం.. కోర్బా ప్యాసింజర్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి కోచ్, గూడ్స్ రైలు బోగీపైకి ఎక్కినట్లు ఘటనా స్థలం నుండి వచ్చిన వీడియోలలో కనిపించింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద బాధితులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎక్స్-గ్రేషియా ప్రకటించింది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించనున్నారు.
Chhattisgarh BREAKING
Bilaspur में Train Accident
पैसेंजर और मालगाड़ी की आमने-सामने टक्कर
राहत-बचाव कार्य में जुटी टीमें
इलाके में भारी भीड़
6 लोगों की मौत की खबर #ChhattisgarhNews #Bilaspur #TrainAccident pic.twitter.com/LinrY3tez3
— Labhesh Ghosh (Bhilai Times) (@labheshghosh) November 4, 2025