E-Paper
Advertisement

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Train Collides: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాంనగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణీకులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సమాచారం ప్రకారం.. కోర్బా ప్యాసింజర్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి కోచ్, గూడ్స్ రైలు బోగీపైకి ఎక్కినట్లు ఘటనా స్థలం నుండి వచ్చిన వీడియోలలో కనిపించింది.

ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద బాధితులకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఎక్స్-గ్రేషియా ప్రకటించింది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించనున్నారు.

 

 

 

 

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×