E-Paper
Advertisement

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు
Advertisement

Train Collides: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాంనగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణీకులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సమాచారం ప్రకారం.. కోర్బా ప్యాసింజర్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి కోచ్, గూడ్స్ రైలు బోగీపైకి ఎక్కినట్లు ఘటనా స్థలం నుండి వచ్చిన వీడియోలలో కనిపించింది.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద బాధితులకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఎక్స్-గ్రేషియా ప్రకటించింది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించనున్నారు.

Advertisement

 

 

 

 

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×