BigTV English

Consumer Forum | సీనియర్ సిటిజన్లకు భారీ జరిమానా.. రైల్వే శాఖకు కోర్టు మొట్టికాయలు!

Consumer Forum | ఢిల్లీ నుంచి బెంగుళురుకు రైలులో ప్రయాణానికి బయలుదేరిన వృద్ధ దంపతులకు రైల్వే అధికారులు(Railways) రూ.22,000 జరిమానా విధించారు. తమ తప్పు లేకపోయినా వారు ఆ జరిమాని చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఆ ఇద్దరు దంపతులు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్కడ న్యాయం జరుగలేదు. దీంతో వారు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు

Consumer Forum | సీనియర్ సిటిజన్లకు భారీ జరిమానా.. రైల్వే శాఖకు కోర్టు మొట్టికాయలు!

Consumer Forum | ఢిల్లీ నుంచి బెంగుళురుకు రైలులో ప్రయాణానికి బయలుదేరిన వృద్ధ దంపతులకు రైల్వే అధికారులు(Railways) రూ.22,000 జరిమానా విధించారు. తమ తప్పు లేకపోయినా వారు ఆ జరిమాని చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఆ ఇద్దరు దంపతులు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్కడ న్యాయం జరుగలేదు. దీంతో వారు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టుని ఆశ్రయించారు.


ఆలోక్ కుమార్ అనే యువకుడి తల్లిదండ్రుల వయసు (తండ్రి 77, తల్లి 70) రీత్యా సీనియర్ సిటిజెన్స్. తల్లిదండ్రుల కోసం ఆలోక్ కుమార్ ఢిల్లీ నుంచి బెంగుళూరుకు ట్రైన్‌లో ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేశాడు. కానీ ప్రయణం చేసే రోజు ప్రయాణికులైన అతని తల్లిదండ్రులు ఫస్ట్ క్లాస్ బోగీ ఎక్కారు. కానీ కాసేపటి తరువాత వారు కూర్చున్న సీట్లు వేరే వాళ్లకు కేటాయించబడ్డాయని వారికి తెలిసింది. ట్రైన్‌లో టిటి ఆఫీసర్ వచ్చి ఆ ఇద్దరు వృద్ధులకు జరిమానా విధించాడు. వారి టికెట్లు మరొకరికి కేటాయించారని.. ఇక వారి టికెట్లు చెల్లవని చెప్పాడు. ట్రైన్‌లో ప్రయాణించాలంటే రూ.22300 జరిమానా చెల్లించాలని లేకపోతే మార్గమధ్యలో దిగిపోవాలని టిటి ఆఫీసర్ అన్నాడు.

చేసేది లేక ఆ వృద్ధ దంపతులు రూ.22,300 చెల్లించాక కూడా వారికి సరైన సీటు లభించలేదు. అతి కష్టం మీద వారు తమ ప్రయాణం పూర్తి చేసి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వారి కొడుకు ఆలోక్ కుమార్ రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో అతను బెంగుళూరు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు లో ఫిర్యాదు చేశాడు.


వినియోగదారుల ఫోరం కోర్టు విచారణ ప్రారంభించినప్పుడు IRCTC BOOKING తరపున వాదించిన లాయర్.. తప్పు తమది కాదని ఎవరో సిస్టమ్ హ్యాక్ చేసి ఉంటారని చెప్పాడు. రైల్వే అధికారులు కూడా తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేకపోయారు. దీంతో వినియోగదారుల ఫోరం రైల్వే శాఖపై సీరియస్ అయింది. వెంటనే వృద్ధ ప్రయాణికుల వద్ద తీసుకున్న రూ.22300 జరిమానాతో పాటు ఇప్పటి వరకు వడ్డీ కలిపి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

దీనికి తోడు రైల్వే తప్పిదం వల్ల మానసిక ఒత్తిడి అనుభవించినందుకు అదనపు రూ.30000, కోర్టు ఖర్చుల కింద మరో రూ.10000 మొత్తం రూ.65000 చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Tags

Related News

Karur Stampade: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ లో కనిపించని విజయ్ పేరు.. డీఎంకే వ్యూహమేంటి?

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Bihar News: బీహార్ ప్రీ-పోల్ సర్వే.. మహా కూటమికి అనుకూలం, ఎన్డీయే కష్టాలు? చివరలో ఏమైనా జరగొచ్చు

Pakistan Prime Minister: భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. మోడీ స్కెచ్ ఏంటి?

Big Stories

×