E-Paper
Advertisement

Delhi Politics: ‘వందేమాతరం’పై పార్లమెంటులో రచ్చ.. 10 గంటలు దీనిపైనే చర్చ, 1937లో ఏం జరిగింది?

Delhi Politics: ‘వందేమాతరం’పై పార్లమెంటులో రచ్చ.. 10 గంటలు దీనిపైనే చర్చ, 1937లో ఏం జరిగింది?

Delhi Politics: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గేయంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. అందుకు 10 గంటలు సమయం కేటాయించారు. ఈ క్రమంలో సభా సమావేశాలు సజావుగా సాగుతాయా? లేకుంటే విమర్శలు-ప్రతి విమర్శలు చోటు చేసుకుంటాయా? అనేదానిపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు జోరందుకున్నాయి.

వందేమాతరం గేయంపై చర్చ

వందేమాతరం గేయం 150 ఏళ్లు కానున్న నేపథ్యంలో సోమవారం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ దీనికి సంబంధించి చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్‌ ప్రసంగించనున్నారు. ఈ చర్చ కోసం 10 గంటల సమయాన్ని కేటాయించారు. కాంగ్రెస్‌ తరపున లోక్‌సభలో పార్టీ ఉపనేత గౌరవ్‌ గొగొయ్, ప్రియాంకాగాంధీలు మాట్లాడనున్నారు. అటు రాజ్యసభలో దీనిపై చర్చను హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం ప్రారంభించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రసంగిస్తారు.

దేశ భక్తి గీతానికి సంబంధించిన తెలిసిన అంశాలను పార్లమెంటు ఉభయసభలు హైలైట్ చేయనున్నాయి. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం 1875 నవంబరు 7న లిటరరీ జర్నల్‌ బంగదర్శన్‌లో తొలిసారి ప్రచురితమైంది. 1882లో ఆనందమఠ్‌ నవలలో బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని భాగం చేశారు. వందేమాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాన్ని జరుపుకుంటోంది. 

వివాదాలకు తావు లేకుండా జరిగేనా?

1937లో ఫైజాబాద్‌లో జరిగిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ గీతం నుంచి కీలక చరణాలను కొందరు నేతలు తొలగించిందని వాదన లేకపోలేదు. దీనివల్ల దేశ విభజనకు బీజాలు నాటిందన్నది బీజేపీ కీలక నేతల మాట.  ఈ నిర్ణయం రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు తీసుకున్నారన్నది కాంగ్రెస్ వాదుల మాట.

ఇతర వర్గాలు, సభ్యుల భావాలను స్వీకరించడమేనని కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తెలిపింది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రధాన జాతీయ నాయకులతో కూడిన వర్కింగ్ కమిటీ ఈ చర్యను సిఫార్సు చేసిందని అంటున్నారు. మొదటి రెండు చరణాలు ఇప్పటికే ఎక్కువగా పాడబడుతున్నారని ఈ కమిటీ గుర్తించింది. 1896 కాంగ్రెస్ సమావేశంలో ఆయన స్వయంగా వందేమాతరం పాడారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ALSO READ: ఇండిగో సంక్షోభం.. ఎమ్మెల్యేలు తిప్పలు, రోడ్డు మార్గంలో కొందరు

సభలో చర్చ సందర్భంగా ఆనాటి వివాదాస్పద అంశాలపై అధికార పార్టీ తెరపైకి తేవచ్చని భావిస్తున్నాయి విపక్షాలు. వీటిని తిప్పికొట్టేందుకు అనుభవమైన నేతలు మాట్లాడాలని భావిస్తున్నారు. ఒకవేళ పాలకపక్షం నుంచి ఎదురుదాడి మొదలైతే దాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయోనని సామాన్యుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×