Delhi Pollution: చలికాలంలో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిని దాటి, గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోతుందన్న సంగతి తెలిసిందే. గత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయలేకపోయిందని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలోని ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ఢిల్లీలో గాలి కాలుష్యం భారీగా పెరిగడంతో గాలి నాణ్యత మరోసారి భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఢిల్లీలో మంగళవారం ఉదయం 400 మార్కును దాటడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3(GRAP 3) అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్దమైంది.
GRAP 3 ప్రకారం భూముల తవ్వకం, పైలింగ్, డ్రైనేజ్ పైపులైన్లు, విద్యుత్ కేబుల్స్ వేయడం, రెడ్ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో నిర్మాణ , కూల్చివేత కార్యకలాపాలపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఢిల్లీలో , గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ ,గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాల్లో BS-III పెట్రోల్ , BS-IV డీజిల్ LMV లను ఫోర్-వీలర్లు వాహనాలు నడపడాన్ని కమిషన్ నిషేధించింది.
Read Also: Delhi Car Blast: ఒక్కరిని కూడా వదిలిపెట్టం.. ఢిల్లీలో పేలుడు ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ మొత్తం AQI సోమవారం 362 నుండి మంగళవారం ఉదయం 11:30 గంటలకు 429కి పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) రిపోర్టు వెల్లడించింది. ఈ సీజన్లో మొదటిసారిగా ఢిల్లీ నగర గాలి నాణ్యత ‘తీవ్రమైన’ స్థాయిలోకి వెళ్లింది. ఢిల్లీ-ఎన్సిఆర్ వ్యాప్తంగా 39 మనిటరింగ్ కేంద్రాలలో, 38 తీవ్ర కాలుష్య స్థాయిలను నమోదు చేశాయి. ముండ్కా (464), ఆర్కె పురం (458), మధుర రోడ్ (458), నెహ్రూ నగర్ (456), ఐటిఓ (452)లలో అత్యధిక AQI రీడింగులు నమోదయ్యాయి.
ఉన్నట్లు భావించాలి. దీర్ఘకాలిక బహిర్గతం వల్ల శ్వాసకోశ అనారోగ్యానికి కారణం కావచ్చు.