BigTV English

Delhi Mayor : బీజేపీ, ఆప్‌ కౌన్సిలర్లు బాహాబాహీ.. ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా..

Delhi Mayor : బీజేపీ, ఆప్‌ కౌన్సిలర్లు బాహాబాహీ.. ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా..

Delhi Mayor : ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రణరంగాన్ని తలపించింది. బీజేపీ-ఆప్‌ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. మేయర్ ఎన్నిక కోసం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.


మరోసారి అదే పరిస్థితి..
మేయర్ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎంసీడీ భవనం వద్ద భారీ భద్రతను, హౌజ్‌లో మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ తొలుత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేసిన కౌన్సిలర్లతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 15 నిమిషాలు హౌజ్‌ను వాయిదా చేశారు. తిరిగి ప్రారంభమైన సమయంలో.. బీజేపీ కౌన్సిలర్లు ‘మోదీ.. మోదీ’అంటూ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా ఆప్‌ కౌన్సిలర్ల వద్దకు వెళ్లి.. నినాదాలు చేస్తూ హౌజ్‌ను వాయిదా వేయాలని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను కోరారు. ఇదే సమయంలో‘‘షేమ్‌.. షేమ్‌’’ అంటూ ఆప్‌ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. మేయర్ ఎన్నికలో గెలుపు కోసం నామినేటెడ్‌ కౌన్సిలర్లను ఓటింగ్‌లో పాల్గొనేలా చూస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో నామినేటెడ్‌ మెంబర్లు ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రిసైడింగ్‌ అధికారి సత్య శర్మ హౌజ్‌ను వాయిదా వేశారు.

గతంలో ఏం జరిగిందంటే..
జనవరి 6న ఇదే రీతిలో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఆ రోజు సభలో సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ మొదట 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మేయర్ ఎన్నికలో వారు ఓటువేయడానికి అనుమతి లేదని ఆప్ అభ్యంతరం తెలిపింది. వారి ప్రమాణ స్వీకారం విషయంలో ఆప్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మేయర్ ఎన్నికను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వారిని నామినేట్‌ చేశారని విమర్శించింది.


ఆప్ ఘన విజయం..
డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘనం విజయం సాధించింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమ గీతం పాడింది. మొత్తం 250 వార్డులు ఉండగా ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. ఆప్‌ తరఫున షెల్లీ ఒబెరాయ్‌ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. మొదటి మేయర్ ఎన్నిక పోటీ చేయడంలేదన్న బీజేపీ .. తర్వాత మాట మార్చింది. దీంతో వివాదం మొదలైంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలన్నర దాటినా ఇంకా మేయర్‌ ప్రక్రియ పూర్తికాలేదు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×