BigTV English
Advertisement

Mahua Moitra: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Mahua Moitra: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Mahua Moitra: జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మపై ఎక్స్ వేదికగా తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్సీడబ్ల్యూసీ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 79 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 123 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


హత్రాస్ ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు రేఖా శర్మ వెళ్లారు. ఆ సమయంలో వర్షం పడటంతో అక్కడున్న వారు ఆమెకు గొడుగు పట్టారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను మొయిత్రా గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిని సుమోటాగా తీసుకుని మహువా మొయిత్రాను అరెస్ట్ చేయాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఆ తర్వాత కూడా మొయిత్రా ఏ మాత్రం తగ్గకుండా ఎన్సీడబ్ల్యూసీ పోస్టుకు ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లాలో ఉన్నానని నా గొడుగు నేను పట్టుకోగలను అంటే రేఖా శర్మను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం గమనార్హం.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో మొయిత్రా గత లోక్ సభలో బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె 50 వేల మెజారిటీతో గెలుపొందారు.


 

Related News

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Big Stories

×