E-Paper
Advertisement

CM Revanth – Irrigation Projects: ఆ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు

CM Revanth – Irrigation Projects: ఆ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు

CM Revanth Reddy – Irrigation Projects: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగేలా 6 ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే నిధులు ఖర్చు చేసినవి, ఆగిపోయినవాటిని, అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. గోదావరి బేసిన్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గోదావరి బేసిన్ లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు దాదాపు రూ. 241 కోట్లు ఖర్చు అవుతుందని, వీటి ద్వారా 48 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అధికారులు అంచనా వేశారు.

తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని, మార్చి 2025 నాటికి వందశాతం పనులు పూర్తవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక తయారు చేయాలన్నారు. రైతులకు సాగునీరు అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లు పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయన్నారు. మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే గత ప్రభుత్వం వదిలేసిందంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు.

Also Read: 31,382 మంది అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి

అయితే, నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×