E-Paper
Advertisement

Dibrugarh Express Train Accident: యూపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. నలుగురు మృతి

Dibrugarh Express Train Accident: యూపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. నలుగురు మృతి

Dibrugarh Express Train Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో రైలు పట్టాలు తప్పింది. గోండాజిల్లాలో చండీగఢ్, డిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకోగా ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ  ప్రమాదంలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది.

చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్‌కు ట్రైన్ బయలు దేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝలాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలో మీటర్ల దూరంలో రైలు ప్రమాదానికి గురైంది. నాలుగు ఏసీ బోగీలు సహా 10 బోగీలకు పైగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సమాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే సీఎం యోగీ ఆథిత్య నాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

బుధవారం రాత్రి 15904 నంబర్ రైలు చండీగఢ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. కాసేపట్లో స్టేషన్‌కు రైలు చేరుకోవాల్సి ఉండగా రైలు పట్టాలు తప్పింది. బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

15 అంబులెన్స్‌లు మెడికల్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లగేజీతో కొందరు, గాయాలపాలైన ప్రయాణికులు కొందరు బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అధికారులు సహాయకచర్యల చేపట్టారు. సీఎం హిమంతా బిస్వా శర్మ ప్రమాదం గురించి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. రైలు ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇతర రైలు పోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×