E-Paper
Advertisement

Farmer Finds 6.65 Carat Diamond: బాప్రే.. చిటికెలో లక్షదికారి అయిన రైతు.. 25 లక్షల విలువ చేసే వజ్రం లభ్యం!

Farmer Finds 6.65 Carat Diamond: బాప్రే.. చిటికెలో లక్షదికారి అయిన రైతు.. 25 లక్షల విలువ చేసే వజ్రం లభ్యం!

Farmer Finds 6.65 Carat Diamond: మధ్యప్రదేశ్‌లో పన్నా ప్రాంతం వజ్రాలకు ఫేమస్. అక్కడ వజ్రం ఎవరికైనా దొరికితే వాళ్లు అదృష్టవంతులని అంటారు. ధర కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా లీజుకు తీసుకున్న ప్రాంతంలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. మార్కెట్‌లో దాని విలువ దాదాపు 25 లక్షల వరకు ఉంచవచ్చని అంచనా.

పట్టి బజారియా గ్రామానికి చెందిన దేశ్‌రాజ్ అనే రైతు కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. ఆ గనిలో 6.65 క్యారెట్ల డైమండ్ దొరికింది. వెంటనే దాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. దీన్ని త్వరలో వేలం వేయనున్నారు. ఈ వజ్రం దాదాపు 25 లక్షలు విలువ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదే రైతుకు గతంలో ఓసారి వజ్రం దొరికింది. దాని విలువ లక్ష మాత్రమే. ఈసారి మాత్రం దేశ్‌రాజ్‌కు పంట పండింది. ఇంకా లోతుల్లోకి వెళ్తే.. కౌరేయ కకర్రాహతి గ్రామానికి చెందిన రైతు దేశ్‌రాజ్. కొన్నాళ్ల కిందట ఈయన పట్టిబజారియా గ్రామంలో కొంత భూమిని లీజుకున్నాడు. కొద్దిరోజులుగా అక్కడ వజ్రాల కోసం వేట సాగిస్తున్నాడు. గులకరాళ్లు, మట్టితోపాటు మెరుస్తున్న రాయి కనిపించింది. వెంటనే ఆ రైతు ఆనందానికి అవదుల్లేవు. గతంలో 1.35 క్యారెట్ల వజ్రం కాగా, ఇప్పుడు 6.65 క్యారెట్లు.

Also Read: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

ప్రస్తుతం పన్నాలో వజ్రాలు వ్యాపారం మందగించింది. గతంలో దొరికిన వజ్రాలకు ఎన్నోసార్లు వేలం నిర్వహించారు. పెద్దగా అమ్ముడుపోయిన సందర్భాలు రాలేదు. అవన్నీ చిన్నవి కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈసారి ఆరు క్యారెట్ల వజ్రం కావడంతో ధర భారీగానే ఉంటుందని చెబుతున్నారు అక్కడి వ్యాపారులు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×