E-Paper
Advertisement

Farmer Finds 6.65 Carat Diamond: బాప్రే.. చిటికెలో లక్షదికారి అయిన రైతు.. 25 లక్షల విలువ చేసే వజ్రం లభ్యం!

Farmer Finds 6.65 Carat Diamond: బాప్రే.. చిటికెలో లక్షదికారి అయిన రైతు.. 25 లక్షల విలువ చేసే వజ్రం లభ్యం!
Advertisement

Farmer Finds 6.65 Carat Diamond: మధ్యప్రదేశ్‌లో పన్నా ప్రాంతం వజ్రాలకు ఫేమస్. అక్కడ వజ్రం ఎవరికైనా దొరికితే వాళ్లు అదృష్టవంతులని అంటారు. ధర కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా లీజుకు తీసుకున్న ప్రాంతంలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. మార్కెట్‌లో దాని విలువ దాదాపు 25 లక్షల వరకు ఉంచవచ్చని అంచనా.

పట్టి బజారియా గ్రామానికి చెందిన దేశ్‌రాజ్ అనే రైతు కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. ఆ గనిలో 6.65 క్యారెట్ల డైమండ్ దొరికింది. వెంటనే దాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. దీన్ని త్వరలో వేలం వేయనున్నారు. ఈ వజ్రం దాదాపు 25 లక్షలు విలువ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ఇదే రైతుకు గతంలో ఓసారి వజ్రం దొరికింది. దాని విలువ లక్ష మాత్రమే. ఈసారి మాత్రం దేశ్‌రాజ్‌కు పంట పండింది. ఇంకా లోతుల్లోకి వెళ్తే.. కౌరేయ కకర్రాహతి గ్రామానికి చెందిన రైతు దేశ్‌రాజ్. కొన్నాళ్ల కిందట ఈయన పట్టిబజారియా గ్రామంలో కొంత భూమిని లీజుకున్నాడు. కొద్దిరోజులుగా అక్కడ వజ్రాల కోసం వేట సాగిస్తున్నాడు. గులకరాళ్లు, మట్టితోపాటు మెరుస్తున్న రాయి కనిపించింది. వెంటనే ఆ రైతు ఆనందానికి అవదుల్లేవు. గతంలో 1.35 క్యారెట్ల వజ్రం కాగా, ఇప్పుడు 6.65 క్యారెట్లు.

Also Read: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

Advertisement

ప్రస్తుతం పన్నాలో వజ్రాలు వ్యాపారం మందగించింది. గతంలో దొరికిన వజ్రాలకు ఎన్నోసార్లు వేలం నిర్వహించారు. పెద్దగా అమ్ముడుపోయిన సందర్భాలు రాలేదు. అవన్నీ చిన్నవి కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈసారి ఆరు క్యారెట్ల వజ్రం కావడంతో ధర భారీగానే ఉంటుందని చెబుతున్నారు అక్కడి వ్యాపారులు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×