E-Paper
Advertisement

Pineapple: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

Pineapple: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం
Advertisement

Pineapple: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. పైనాపిల్స్ ను కానుకగా పంపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగుపడేలా గౌరవ సూచికంగా ఆమెకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ ను పంపారు. అఖుర ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసీపీ) ద్వారా ఈ పండ్లను బంగ్లాదేశ్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

‘సీఎం ఆదేశాల మేరకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పంపాం. 100 ప్యాకెట్లలో ఈ పండ్లను పెట్టి తరలించాము. ఒక్కో ప్యాకెట్ లో 6 పండ్లు, ఒక్కో పండు బరువు వచ్చేసి 750 గ్రాముల చొప్పున ఉంటుంది’ అంటూ త్రిపుర ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపక్ తెలిపారు.

Advertisement

Also Read: రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ.. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా? అంటూ..

భారత్ – బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని ఆయన తెలిపారు. పరస్పరం గౌరవ భావంతో చేసే ఇలాంటి చర్యల వల్ల సంబంధాలు మరింత బలపడుతాయన్నారు. గతేడాది కూడా త్రిపుర సీఎం మాణిక్ సాహా.. షేక్ హసీనాకు పైనాపిల్స్ పంపించారు. దీంతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె కూడా తిరిగి మామిడి పండ్లను సీఎంకు పంపించి తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×