EPAPER

Pineapple: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

Pineapple: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

Pineapple: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. పైనాపిల్స్ ను కానుకగా పంపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగుపడేలా గౌరవ సూచికంగా ఆమెకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ ను పంపారు. అఖుర ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసీపీ) ద్వారా ఈ పండ్లను బంగ్లాదేశ్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.


‘సీఎం ఆదేశాల మేరకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పంపాం. 100 ప్యాకెట్లలో ఈ పండ్లను పెట్టి తరలించాము. ఒక్కో ప్యాకెట్ లో 6 పండ్లు, ఒక్కో పండు బరువు వచ్చేసి 750 గ్రాముల చొప్పున ఉంటుంది’ అంటూ త్రిపుర ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపక్ తెలిపారు.

Also Read: రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ.. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా? అంటూ..


భారత్ – బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని ఆయన తెలిపారు. పరస్పరం గౌరవ భావంతో చేసే ఇలాంటి చర్యల వల్ల సంబంధాలు మరింత బలపడుతాయన్నారు. గతేడాది కూడా త్రిపుర సీఎం మాణిక్ సాహా.. షేక్ హసీనాకు పైనాపిల్స్ పంపించారు. దీంతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె కూడా తిరిగి మామిడి పండ్లను సీఎంకు పంపించి తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×