Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం ఉదయం వాష్రూమ్కు వెళ్లిన సమయంలో ఆయన రెండుసార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ధన్కడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి గల కారణాలను విశ్లేషించేందుకు వైద్యులు ఎంఆర్ఐ (MRI) స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిపుణులైన వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జగదీప్ ధన్కడ్, గతేడాది జూలై 21న తన ఆరోగ్య కారణాలను చూపుతూనే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Read Also: చిరంజీవి సినిమా చూస్తూ అభిమాని మృతి.. ఏం జరిగిందంటే?