E-Paper
Advertisement

Chiranjeevi Fan dies: చిరంజీవి సినిమా చూస్తూ అభిమాని మృతి.. ఏం జరిగిందంటే?

Chiranjeevi Fan dies: చిరంజీవి సినిమా చూస్తూ అభిమాని మృతి.. ఏం జరిగిందంటే?
Advertisement

Chiranjeevi Fan dies: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది .ఇక చాలా రోజుల తర్వాత చిరంజీవి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున కోలాహల వాతావరణం ఏర్పడింది. ఇలా చిరంజీవి సినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి సినిమా విడుదల సందర్భంగా ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.

రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్..

చిరు సినిమా చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ఈ సినిమా చూస్తూ థియేటర్ లోనే కుప్పకూలి మృతి చెందారు. దీంతో థియేటర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్ కుమార్ ఇవాళ ఉదయం 11:30 గంటల షో చూడటం కోసం థియేటర్ కు వెళ్లారు అయితే సినిమా చూస్తున్న సమయంలోనే ఈయన ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం గమనించిన తోటి ప్రేక్షకులు వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే ఆనంద్ కుమార్ గుండెపోటుతోనే మరణించారని తెలుస్తుంది.

గుండెపోటుతో మరణించిన ఆనంద్…

Advertisement

ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో మెగా అభిమాని మరణించారనే విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతుడు ఆనంద్ కుమార్ కు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మన శంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలోను మంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనిల్ డైరెక్షన్ లో 9వ హిట్ ..

Advertisement

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించి సందడి చేశారు. మరొక స్టార్ హీరో వెంకటేష్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇలా చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఈ సినిమా తొమ్మిదవ సినిమా కావటం విశేషం ఇలా ఈయన దర్శకత్వంలో వచ్చిన తొమ్మిది సినిమాలు కూడా మంచి సక్సెస్ కావడం విశేషం.

Also Read; Vijay Thalapathy : విజయ్ ఆఖరి సినిమా అనిల్ రావిపూడితో చేయాల్సిందా.. మరేమైందంటే?

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×