E-Paper
Advertisement

Parliament Attack : లోక్ సభ ఘటనలో నలుగురు అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు..

Parliament Attack : లోక్ సభ ఘటనలో నలుగురు అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు..

Parliament Attack : దేశాన్ని మొత్తం షేక్ చేసిన పార్లమెంట్‌ అలజడిపై దర్యాప్తు ప్రారంభమైంది. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ లోపల, వెలుపల ఆందోళన చేసిన ఘటనలో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్‌ లోపల ఇద్దరు యువకులను, పార్లమెంట్‌ వెలుపల ఓ యువకుడు, మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇప్పుడు వీరందరిని వేరువేరుగా విచారిస్తున్నారు పోలీసులు.

పార్లమెంట్‌ వెలుపల ఆందోళన చేసిన మహిళను హర్యాణా హీస్సార్ కు చెందిన నీలమ్‌గా, యువకుడిని మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ షిండేగా గుర్తించారు. లోపల ఆందోళన నిర్వహించిన ఇద్దరు యువకులను కూడా గుర్తించారు. సాగర్ శర్మ, దేవరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ అలజడికి కారణమన్నారు పోలీసులు. వీరిద్దరు మైసూర్ కు చెందని వారిగా గుర్తించారు. అసలు వారు ఎందుకు అలజడి సృష్టించారన్న దానిపైనే మొదట ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కూడా దర్యాప్తు నిర్వహించాలని స్పీకర్‌ ఓం బిర్లా దర్యాప్తుకు ఆదేశించారు. స్మోక్‌ బాంబ్‌లు అసలు పార్లమెంట్‌ లోపలికి ఎలా తీసుకొచ్చారన్నది ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది. దీనిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×