E-Paper
Advertisement

Gold Slipper : ఆ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ..! రేటు రూ.69.40 లక్షలు.. ఎందుకో తెలుసా..?

Gold Slipper : ఆ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ..! రేటు రూ.69.40 లక్షలు.. ఎందుకో తెలుసా..?
Advertisement

Gold Slipper: చాలామంది ఎదుటివారిపై కోపం వస్తే చెప్పుతో కొడతా అంటారు. ఈ మధ్యకాలంలో పొలిటికల్ లీడర్లు చెప్పుతో కొడతామని తమ ప్రత్యర్థి పార్టీల నేతలను హెచ్చరిస్తున్నారు. చెప్పు అంటే విలువలేనిది అని అందరూ భావిస్తారు. అందుకే వాటిని గుమ్మం ముందే వదిలి ఇంటిలోకి వెళతారు. కానీ ఈ చెప్పులు చాలా కాస్ట్లీ గురూ ..! అక్షరాల 69 లక్షల 40 వేల రూపాయిలు. ఎందుకు అంత ఖరీదంటారా? ఆ చెప్పుల్లో 1.2 కేజీల గోల్డ్ ఉంది. అందుకే అది కాస్ట్లీ. చెప్పులేంటి?.. బంగారం ఉండటం ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్పుల్లో గోల్డ్ కథ తెలుసుకుందాం..!

ఓ ఫ్లైట్ బెంగళూరు విమానాశ్రయంలో దిగింది. ప్రయాణికులందర్నీ చెక్ చేసి కస్టమ్స్ అధికారులు బయటకు పంపుతున్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడు ధరించిన చెప్పులపై కస్టమ్స్ అధికారులకు డౌట్ వచ్చింది. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ చెప్పుల అడుగుభాగంలో గోల్డ్ ను గుర్తించారు. ఆ బంగారం ఎంత ఉందో వేయింగ్ మిషన్ పై ఉంచారు. ఆ గోల్డ్ ఎంత ఉందో చూసి.. కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారు. ఆ గోల్డ్ 1.2 కేజీలు ఉంది. మార్కెట్ లో ఈ బంగారం విలువ అక్షరాల 69.40 లక్షలు. దీంతో ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంతకీ ఆ విమానం బ్యాంకాక్ నుంచి బెంగళూరు వచ్చింది.

Advertisement

సినిమాల్లో చూపించే స్మగ్లింగ్ సీన్లను తలదన్నే రీతిలో స్మగ్లర్లు తమ క్రిమినల్ క్రియేటివిటీ చూపిస్తున్నారు. చాలా సినిమాల్లో స్మగ్లింగ్ ఎలా చేస్తారో చూపించారు. పుష్ప మూవీలో ఎర్ర చందనాన్ని పాల వ్యానుల్లో ఎలా తరలిస్తారో చూశాం. కానీ రియల్ లైఫ్ లో స్మగ్లర్లు సినిమా దర్శకుల క్రియేటివిటీని మించి ఆలోచిస్తున్నారు.

ముఖ్యంగా విదేశాల నుంచి భారత్ కు డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. విమానాశ్రయాల్లో ఇలాంటి కేసులు ఈ మధ్యకాలంలో భారీగా వెలుగుచూస్తున్నాయి. ఎయిర్ పోర్టుల్లో గోల్డ్ సీజ్ కేసులు కామన్ గా మారిపోయాయి. కొందరు లోదుస్తుల్లోనూ బంగారం తరలిస్తూ పట్టుబడిన వారు ఉన్నారు. ఇలా స్మగ్లింగ్ ముఠాలు న్యూ ఐడియాస్ తో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కొందరే పట్టుబడుతున్నారు. దొరకని స్మగ్లర్లు ఎంతో మంది ఉన్నారు. బీ అలెర్ట్ @ ఎయిర్ పోర్ట్స్..!

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×