ISRO News Today(Latest breaking news in telugu): శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్.. షార్ నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశట్టింది. ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. దీంతో శాస్త్రవేత్తలు సంబార
ఈ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా 27.30 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగింది. ఆ తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగం చేపట్టారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు. దీని బరువు 420 టన్నులు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-01 మొదటిది కావడం విశేషం. 2,232 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు పనిచేస్తుంది. భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది. త్వరలో నావిక్ పేరుతో దేశీయ నావిగేషన్ సేలు