E-Paper
Advertisement

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?
Advertisement

Bangladesh Hindus: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని అక్కడి మత ఛాందసవాద అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. కనిపిస్తే చాలు దాడులకు తెగబడుతూ, ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక హృదయ విదారక ఘటనలో, 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్ లో బీజేపీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసిందని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదికగా ఆందోళ‌న చెందింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించిన, ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుందని పేర్కోంది. గడిచిన మూడు వారాల వ్యవధిలోనే ఏడుగురు హిందూ పురుషులు హత్యకు గురయ్యారంటే అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

బంగ్లాదేశ్‌లో హిందువులను అక్షరాలా వేటాడుతున్నారు. అంతేకాకుండా, ఓ హిందూ మహిళపై ముస్లింలు అత్యాచారానికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. ఇవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నవి కావని, ప్రణాళికాబద్ధంగా హిందువులను అంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ పరిణామాల ప్రభావం కనిపిస్తోంది. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, బంగ్లాదేశ్ సంస్కృతి ఇక్కడికి పాకిందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మ‌రోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్ హత్య, మహిళలపై అత్యాచారాలు, దేవాలయాల ధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నా భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు బలమైన ప్రకటన రాకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×