E-Paper
Advertisement

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?
Advertisement

Bangladesh Hindus: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని అక్కడి మత ఛాందసవాద అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. కనిపిస్తే చాలు దాడులకు తెగబడుతూ, ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక హృదయ విదారక ఘటనలో, 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్ లో బీజేపీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసిందని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదికగా ఆందోళ‌న చెందింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించిన, ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుందని పేర్కోంది. గడిచిన మూడు వారాల వ్యవధిలోనే ఏడుగురు హిందూ పురుషులు హత్యకు గురయ్యారంటే అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

బంగ్లాదేశ్‌లో హిందువులను అక్షరాలా వేటాడుతున్నారు. అంతేకాకుండా, ఓ హిందూ మహిళపై ముస్లింలు అత్యాచారానికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. ఇవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నవి కావని, ప్రణాళికాబద్ధంగా హిందువులను అంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ పరిణామాల ప్రభావం కనిపిస్తోంది. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, బంగ్లాదేశ్ సంస్కృతి ఇక్కడికి పాకిందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మ‌రోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్ హత్య, మహిళలపై అత్యాచారాలు, దేవాలయాల ధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నా భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు బలమైన ప్రకటన రాకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×