E-Paper
Advertisement

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?

Bangladesh Hindus: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని అక్కడి మత ఛాందసవాద అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. కనిపిస్తే చాలు దాడులకు తెగబడుతూ, ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక హృదయ విదారక ఘటనలో, 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్ లో బీజేపీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్‌ను ఓ ఉన్మాద గుంపు కిరాతకంగా హత్య చేసిందని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదికగా ఆందోళ‌న చెందింది. అల్లరి మూకల దాడి నుంచి తప్పించుకునేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడు ఎంత ప్రయత్నించిన, ఆ గుంపు అతడిని వెంబడించి మరీ పొట్టనబెట్టుకుందని పేర్కోంది. గడిచిన మూడు వారాల వ్యవధిలోనే ఏడుగురు హిందూ పురుషులు హత్యకు గురయ్యారంటే అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపింది.

బంగ్లాదేశ్‌లో హిందువులను అక్షరాలా వేటాడుతున్నారు. అంతేకాకుండా, ఓ హిందూ మహిళపై ముస్లింలు అత్యాచారానికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. ఇవన్నీ యాదృచ్చికంగా జరుగుతున్నవి కావని, ప్రణాళికాబద్ధంగా హిందువులను అంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ పరిణామాల ప్రభావం కనిపిస్తోంది. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, బంగ్లాదేశ్ సంస్కృతి ఇక్కడికి పాకిందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 25 ఏళ్ల హిందూ యువకుడు మిథున్ సర్కార్ హత్య, మహిళలపై అత్యాచారాలు, దేవాలయాల ధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నా భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు బలమైన ప్రకటన రాకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×