E-Paper
Advertisement

Fire Accident: అగ్ని ప్రమాదాల్లో.. భారీ ఆస్తి నష్టం..?

Fire Accident: అగ్ని ప్రమాదాల్లో..  భారీ ఆస్తి నష్టం..?
Advertisement

Fire Accident in UP: ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘజియాబాద్‌ ఖోడా ప్రాంతంలోని ఓ గోడౌన్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలం నుంచి దట్టపైన పొగ చుట్టూ ఉన్న ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఛీప్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ మంటలను అదుపు చేసేందుకు తమ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సమాచారం అందిన వెంటనే.. వైశాలి ఫైర్ స్టేషన్ నుంచి 3 ఫైర్ సిబ్బంది బృందాలతో పాటు, సాహిబాబాద్ స్టేషన్ నుంచి 2, కొత్వాలి నుంచి రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read:మండువేసవిలో మంచువర్షం.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

పశ్చిమబెంగాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. హల్దియా సూపర్ మార్కెట్ ప్రాంతంలో పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దుకాణాల్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×