E-Paper
Advertisement

New Parliament Building : పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధాని..

New Parliament Building : పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధాని..
Advertisement

New Parliament Building : నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు కలిసి మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రధాని మోదీ లోనికి ప్రవేశించారు. గణపతి హోమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కొత్త పార్లమెంట్‌ భవనంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం.. సెంగోల్‌ను మోదీ స్వీకరించారు. ఆ తర్వాత సెంగోల్‌ను లోక్‌సభలో స్పీకర్‌ కుర్చీ పక్కన ప్రతిష్ఠించారు. ఆ తర్వాత మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని సత్కరించారు . వారికి జ్ఞాపికలు అందజేశారు. పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ.

Advertisement

భారతదేశ చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టానికి ఈ కార్మికులే నిర్మాతలని మోదీ ప్రశంసించారు. వారి చెమట చుక్కలతో ఈ భవనం రూపుదిద్దుకుందని తెలిపారు. వారిని సన్మానించడం తన అదృష్టమన్నారు. కార్మికులు, వారికి భోజనాలు అందించిన వారిని.. స్వచ్ఛత బాధ్యతలు తీసుకున్నవారిని.. చాయ్‌ అందించిన వారిని.. ఫిట్టింగ్ కార్మికులను, కలర్‌ వేసిన కార్మికులను, ఫ్లోరింగ్ చేసిన వారిని, మెకానిక్‌లను ఇలా అన్ని విభాగాల కార్మికులను సన్మానించారు .

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×