E-Paper
Advertisement

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..
Advertisement

Delhi Air Pollution: అనుకున్నదే జరిగింది. ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పీల్చే గాలి విషపూరితంగా మారడంతో హస్తిన ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో N-95 మాస్క్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. వాయు నాణ్య త కూడా సగటున 414 పాయింట్లకు చేరుకుంది. కాలుష్యం, పొగమంచుతో విజబిలిటీ పూర్తిగా తగ్గింది. మరోవైపు గాలి కాలుష్యంపై అధికార-విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. గత 14రోజులు నుండి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గాలి కాలుష్యం.. ఆ ప్రాంతాలు.. ఆనంద్ విహార్ (411), బవానా (414), చాందిని చౌక్ (407), నరేలా (407), JLN స్టేడియం (401), బురారి (402), అశోక్ విహార్ (417) మరియు అయా నగర్ (402), ITO (396), అలీపూర్ (355), IGI విమానాశ్రయం (360), నజాఫ్‌గఢ్ (361) ఉన్నాయి.

Advertisement

అటు ఢిల్లీ కాలుష్యంపై.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కోర్టుల దగ్గర మంత్రదండం లేదన్నారు. శుద్ధమైన గాలి కోసం ఏం ఆదేశించాలో కూడా తెలియడం లేదంటున్నారు. గాలి నాణ్యత తగ్గిన వేళ తాను బయటికి వెళ్లడం.. వాకింగ్ కూడా చేయడం మానేసినట్లు చెప్పారు.

Also Read: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ.2 లక్షలు..?

Advertisement

ఇక సమస్యను పరిష్కరించేందుకు కోర్టులు అద్భుతాలు చేయలేవన్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఢిల్లీ కాలుష్య సమస్యకు కారణమేంటనేది అందరికీ తెలుసన్నారు. వాటికి పరిష్కారాన్ని గుర్తించాలని సూచనలు చేశారు. జనం కూడా బయటకు రావాలంటే హడలిపోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ కేసు ప్రతి ఏడాది దీవాళి సమయంలో తెరపైకి వస్తుందని గుర్తు చేశారు.

Related News

జమ్మూకాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×