Delhi Air Pollution: అనుకున్నదే జరిగింది. ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పీల్చే గాలి విషపూరితంగా మారడంతో హస్తిన ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో N-95 మాస్క్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. వాయు నాణ్య త కూడా సగటున 414 పాయింట్లకు చేరుకుంది. కాలుష్యం, పొగమంచుతో విజబిలిటీ పూర్తిగా తగ్గింది. మరోవైపు గాలి కాలుష్యంపై అధికార-విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. గత 14రోజులు నుండి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గాలి కాలుష్యం.. ఆ ప్రాంతాలు.. ఆనంద్ విహార్ (411), బవానా (414), చాందిని చౌక్ (407), నరేలా (407), JLN స్టేడియం (401), బురారి (402), అశోక్ విహార్ (417) మరియు అయా నగర్ (402), ITO (396), అలీపూర్ (355), IGI విమానాశ్రయం (360), నజాఫ్గఢ్ (361) ఉన్నాయి.
అటు ఢిల్లీ కాలుష్యంపై.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కోర్టుల దగ్గర మంత్రదండం లేదన్నారు. శుద్ధమైన గాలి కోసం ఏం ఆదేశించాలో కూడా తెలియడం లేదంటున్నారు. గాలి నాణ్యత తగ్గిన వేళ తాను బయటికి వెళ్లడం.. వాకింగ్ కూడా చేయడం మానేసినట్లు చెప్పారు.
Also Read: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ.2 లక్షలు..?
ఇక సమస్యను పరిష్కరించేందుకు కోర్టులు అద్భుతాలు చేయలేవన్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఢిల్లీ కాలుష్య సమస్యకు కారణమేంటనేది అందరికీ తెలుసన్నారు. వాటికి పరిష్కారాన్ని గుర్తించాలని సూచనలు చేశారు. జనం కూడా బయటకు రావాలంటే హడలిపోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ కేసు ప్రతి ఏడాది దీవాళి సమయంలో తెరపైకి వస్తుందని గుర్తు చేశారు.
ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం
పీల్చే గాలి విషపూరితం కావడంతో వ్యాధుల బారిన పడుతున్న హస్తిన ప్రజలు
ప్రజలు N-95 మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్న నిపుణులు
గత 14 రోజులుగా ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత pic.twitter.com/9mVrKLVrk2
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2025