Transport Infrastructure: కేంద్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేలా ఉన్నాయి. సుమారు 1,60,504 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల కల్పనలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. వీటిలో ప్రధానంగా అస్సాం ప్రాజెక్ట్ , తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రోడ్డు ప్రాజెక్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అస్సాం అండర్ వాటర్ టన్నెల్
అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద గోహుపూర్ – నుమాలిఘర్ మధ్య అత్యాధునిక అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ఉన్న 250 కిలోమీటర్ల దూరం ఈ టన్నెల్ వల్ల కేవలం 34 కిలోమీటర్లకు తగ్గుతుంది.దీని వల్ల 6 గంటల సుదీర్ఘ ప్రయాణం ఇకపై కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇది రైల్వే లైన్ , నేషనల్ హైవే రెండింటినీ కలుపుతూ సాగే వ్యూహాత్మక ప్రాజెక్ట్.
తెలుగు రాష్ట్రాల కనెక్టివిటీ
తెలంగాణ , కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు మేలు చేకూర్చేలా గూడె బేల్లూరు – మహబూబ్ నగర్ సెక్షన్ మధ్య నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 3 వేల 175 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివల్ల మహబూబ్ నగర్, నారాయణపేట, దేవరకద్ర ప్రాంతాల నుండి హైదరాబాద్ , రాయచూర్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ – పనాజీ (గోవా) కారిడార్ అభివృద్ధిలో భాగంగా 80 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారిని నిర్మించనున్నారు.
రైల్వే , ఇతర రహదారి ప్రాజెక్టులు
రైల్వే రద్దీని తగ్గించడానికి , సరుకు రవాణాను వేగవంతం చేయడానికి పలు కీలక మార్గాల్లో 3వ, 4వ లైన్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అలాగే.. దమాసియా – బిటాడ – నర్సాపూర్ – మలోత సెక్షన్ (₹4,584 కోట్లు), గోతి – ట్రిమ్బక్ – పాల్గర్ సెక్షన్ (₹3,320 కోట్లు) అప్గ్రేడేషన్ పనులు చేపట్టనున్నారు. ఈ నిర్ణయాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరగడమే కాకుండా.. పర్యాటక , వాణిజ్య రంగాలు భారీగా పుంజుకుంటాయి.
Also Read: చంద్రబాబు, జగన్, పవన్.. ముగ్గురూ బీజేపీకి బానిసలే.. ఏపీసీసీ అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు