Ronisha Satti: జమ్ము కాశ్మీర్ కు చెందిన ప్రముఖ ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రోనిషా సత్తి.. ఆత్మహత్యాయత్నం చేశారు. కాబోయే భర్త ప్రశాంత్ శర్మ తనను, తన కుటుంబాన్ని తప్పుడు ప్రచారాలతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో రెండు వీడియోలు పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రోనిషాను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర సేవలు అందిస్తున్నారు.
రోనిషా తల్లి రీనా సత్తి మాట్లాడుతూ ప్రశాంత్ శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో రోనిషాపై అభ్యంతరక కామెంట్స్ ను ప్రశాంత్ చేశారని పేర్కొన్నారు. తన కూతురి పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించి.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త సాధారణ ఆటో డ్రైవర్ అన్న రీనా.. పిల్లల్ని అప్పు చేసి మరీ చదివించినట్లు తెలిపారు. కుటుంబాన్ని పోషించడానికి తాను బట్టలు సైతం కుట్టానని అన్నారు. తన బిడ్డకు ఇంత అన్యాయం జరిగినా పోలీసుల నుంచి ఎలాంటి సహాయం తమకు లభించలేదని రీనా ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తన కూతురు దగ్గర రూ.10 లక్షల వరకూ డబ్బును ప్రశాంత్ తీసుకున్నారని రీనా ఆరోపించారు.
#Shocking Ronisha Satti (Influencer) ne attempt kiya Su!cide
Ronisha ki Maa ne kya kaha ? pic.twitter.com/ve0u0JIcvm— newspointJ&K (@NewspointjK) May 28, 2026
మరోవైపు ప్రశాంత్ శర్మ తరపు న్యాయవాది ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రశాంత్ శర్మకు 2024 సెప్టెంబర్ లో రోనిషాతో పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఆమెకు అప్పటికే వివాహం జరిగి విడాకులు అయ్యాయని చెప్పారు. నిశ్చితార్థం చేసుకొని 6 నెలల్లో పెళ్లి కూడా చేసుకోవాలని ప్రశాంత్, రోనిషా భావించారని అన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో రోనిషాను 3-4 సార్లు దుబాయికి తీసుకెళ్లి బంగారం, భారీ మెుత్తంలో షాపింగ్ ను తన క్లెయింట్ ప్రశాంత్ చేయించారని తెలిపారు. యూపీఐ ద్వారా చేసిన రూ.9.5 లక్షల నగదు లావాదేవీ ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని ప్రశాంత్ లాయర్ వెల్లడించారు.
Also Read: అమ్మబాబోయ్.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్లో ఎక్కడంటే?
పెళ్లి చేసుకోమని ప్రశాంత్ శర్మ ఒత్తిడి తీసుకురావడంతో.. పెళ్లి చేసుకునేది లేదని రోనిషా, ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని లాయర్ అన్నారు. అంతేకాకుండా రోనిషాకు తన మెుదటి భర్తతో విడాకులు కూడా మంజూరు కాలేదని చెప్పారు. ఈ మేరకు ప్రశాంత్ శర్మ.. రోనిషాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా చీటింగ్ కేసు పెట్టారని తెలియజేశారు. మరోవైపు ప్రశాంత్ పై రోనిషా ఫ్యామిలీ పెట్టిన కేసుపై అప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్టే సైతం ఇచ్చిందని న్యాయవాది చెప్పుకొచ్చారు. మెుత్తం మీద రోనిషా ఆత్మహత్య కేసు జమ్ముకాశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఇందులో ఎవరి వాదనలో నిజం ఉందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై జమ్ముకాశ్మీర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మొబైల్ బ్యాక్ ప్యానెల్ ఇలాగే క్లీన్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఫోన్ పూర్తిగా పాడైపోవచ్చు!