BigTV English

Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

Bihar: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి అక్కడున్న అమ్మాయిలను చూసి స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన బీహార్‌లోని నలందాలో జరిగింది. మనీశ్ శంకర్(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కలాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం గణిత పరీక్ష ఉండడంతో మనీశ్‌ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకెళ్లాడు.


పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లిన మనీశ్ ఒక్కసారిగా అక్కడున్న అమ్మాయిలను చూసి షాక్ అయ్యాడు. స్పృహతప్పిపోయి కిందపడ్డాడు. వెంటనే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నాడు. అయితే పరీక్ష హాల్‌లో 50 మంది అమ్మాయిలు ఉన్నారని.. వారి మధ్యలో మనీశ్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయాడని అతని తండ్రి సచ్చిదానంద్ తెలిపారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×