E-Paper
Advertisement

International Yoga Day: ఆసనాలు వేసిన మోదీ..శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగా వేడుకలు

International Yoga Day: ఆసనాలు వేసిన  మోదీ..శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగా వేడుకలు

PM Modi Yoga Day Celebrations: విదేశాల్లోనూ యోగాకు ప్రాధాన్యత పెరిగిందని, యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించిన తర్వాత మార్పు మొదలైందని తెలిపారు.

శ్రీనగర్‌లోని దాల్ సరస్స సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు. దేశ వ్యాప్తంగా యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. వాస్తవానికి ప్రధాని 7 వేలమందితో కలిసి ఆసనాలు వేయాల్సి ఉండగా.. వర్షం కారణంగా అప్పటికప్పుడు వేదికను షేర్ ఏ కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. దీంతో ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.

యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై కొందరితో సరదాగా ముచ్చిటించారు. ఆ తర్వాత మోదీ ప్రజలతో సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలను స్వయంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేవారు.ఈ ఫోటోలతోపాటు ‘ శ్రీనగర్‌లో యోగాసనాలు వేసిన తర్వాత దిగిన సెల్ఫీలు, దాల్ సరస్సు వద్ద అసమాన్యమైన చైతన్యం కనిపించింది.’ అని రాసుకొచ్చారు.

యోగా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులతో సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రులు జైశంకర్, బీఎల్ వర్మ, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, హెచ్ డీ కుమార స్వామి, కిరన్ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా చేశారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×