E-Paper
Advertisement

Odisha Crime: కూతురిపై అత్యాచారయత్నం.. కామాంధుడిని బండరాయితో కొట్టి చంపిన తండ్రి

Odisha Crime: కూతురిపై అత్యాచారయత్నం.. కామాంధుడిని బండరాయితో కొట్టి చంపిన తండ్రి

Odisha Crime: ఒడిశాలోని ధెన్ కనల్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఓ కామాంధుడిని, ఆ బాలిక తండ్రి బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన ధెన్ కనల్ జిల్లాలో జరిగింది. తన కూతురితో కలిసి ఓ తండ్రి సమీపంలోని కాలువ వద్ద స్నానానికి వెళ్లారు. స్నానం పూర్తయిన తర్వాత, బాలిక కాలువ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన సమయంలో, కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

బాలిక అకస్మాత్తుగా గట్టిగా ఏడవడంతో, పక్కనే ఉన్న ఆమె తండ్రి వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి పరుగున వచ్చారు. తన కూతురు దుర్భర పరిస్థితిని, కరుణాకర్ దుశ్చర్యను చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. క్షణికావేశంలో ఆ తండ్రి అక్కడే ఉన్న పెద్ద బండరాయిని తీసుకుని కరుణాకర్‌పై దాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో కరుణాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటన జరిగిన వెంటనే, ఆ తండ్రి పర్జంగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన కూతురిపై అత్యాచార యత్నాన్ని అడ్డుకునే క్రమంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులకు వివరించాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కుమార్తెపై జరిగిన దాడిని చూసి ఆవేశంతో హత్య చేసినట్లు అంగీకరించిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×