E-Paper
Advertisement

Iphone stolen in Vrindavan | గుడిలో భక్తుడి ఐఫోన్ చోరీ.. అందరూ చూస్తున్నా బెదరని దొంగ?

Iphone stolen in Vrindavan | ఈ రోజుల్లో అందరూ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ స్మార్ట్ ఫోన్లు ఉండేసరికి.. దొంగలకు ఇవి ఈజీ టార్గెట్‌గా మారిపోయాయి. స్మోర్ట్ ఫోన్ చోరీల ఫిర్యాదులు కూడా పోలీస్ స్టేషన్లలో ఎక్కువైపోయాయి. రద్దీగా ఉండే ప్రదేశాలలోనే సెల్ ఫోన్స్ దొంగతనాలు జరుగుతుంటాయి. అందుకే తాజాగా ఓ ప్రముఖ దేవాలయంలో ఓ భక్తుడి ఐఫోన్ చోరీ అయింది.

Iphone stolen in Vrindavan | గుడిలో భక్తుడి ఐఫోన్ చోరీ.. అందరూ చూస్తున్నా బెదరని దొంగ?

Iphone stolen in Vrindavan | ఈ రోజుల్లో అందరూ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ స్మార్ట్ ఫోన్లు ఉండేసరికి.. దొంగలకు ఇవి ఈజీ టార్గెట్‌గా మారిపోయాయి. స్మోర్ట్ ఫోన్ చోరీల ఫిర్యాదులు కూడా పోలీస్ స్టేషన్లలో ఎక్కువైపోయాయి. రద్దీగా ఉండే ప్రదేశాలలోనే సెల్ ఫోన్స్ దొంగతనాలు జరుగుతుంటాయి. అందుకే తాజాగా ఓ ప్రముఖ దేవాలయంలో ఓ భక్తుడి ఐఫోన్ చోరీ అయింది.

విశేషమేమిటంటే.. అందరికీ ఆ దొంగ ఎవరో తెలిసినా.. ఏమీ చేయలేని పరిస్థితి. ఆ దొంగ అందరికీ అందకుండా ఎత్తైన గోడపై కూర్చున్నాడు. ఐఫోన్ యజమాని అయిన భక్తుడు, అతని మిత్రులు ఆ దొంగను భయపడించారు, ఫలితం లేకపోవడంతో ఫ్రాదేయపడ్డారు. ఆ ఫోన్ తిరిగి ఇచ్చేయమని. కానీ అతను బెదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకీ ఆ దొంగ మన అందరికీ తెలుసు. విషయమేమిటంటే..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ బృందావన్ దేవాలయంలో దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి ఐఫోన్ చోరీ అయింది.

అయితే ఆ ఫోన్ దొంగ ఎవరో కాదు. ఒక కోతి. విలువైన ఐఫోన్ తీసుకొని ఆ కోతి తన మిత్ర బ‌ృందంతో గోడపై కూర్చుంది. ఆ ఐఫోన్ యజమాని, అతని మిత్రులు మాత్రం ఆ కోతిని భయపడించారు. కానీ ఆ కోతి ఏమీ పట్టనట్టు కూర్చొని ఉంది. చివరికి ఒక వ్యక్తి దాన్ని ప్రాధేయపడి.. ఒక అరటి పండు దాని వైపు పైకి విసిరాడు. దీంతో ఆ కోతి ఫోన్ కిందకు పడేసి.. ఆ అరటిపండుని గాల్లో క్యాచ్ పట్టుకొని పారిపోయింది. ఈ ఫన్నీ దృశ్యం ఇన్స్‌టాగ్రామ్‌లో ఒక యూజర్ పోస్ట్ చేయగా.. విపరీతంగా వైరల్ అవుతోంది.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×