BigTV English
Advertisement

Defamation Case On MS Dhoni : ధోనీపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా.. రేపే విచారణ..

Defamation Case On MS Dhoni : ధోనీపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా.. రేపే విచారణ..

Defamation Case On MS Dhoni : ఒకప్పుడు టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించి క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలయ్యింది.  ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్స్ మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కేసు పెట్టారు. తమపై ధోనీ అసత్య ఆరోపణలు చేశాడని, ఆ దంపతులు కోర్టును ఆశ్రయించారు. గురువారం ఢిల్లీ హైకోర్టువిచారణ చేపట్టనుంది.


అంతేకాదు, నిజానిజాలను పట్టించుకోకుండా, ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ప్రచురించి, తమకు మనోవేదన కలిగించిన పోస్ట్‌లు, వాటిని అనుమతించిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఎక్స్, గూగుల్, ఫేస్‌బుక్‌ , ఇంకా ఈ వార్తలను ప్రచురించిన పత్రికలు, టీవీ ఛానళ్లపై కూడా పరువు నష్టం దావా వేశారు.

ఒక వ్యాపార వ్యవహారంలో ఒక అగ్రిమెంట్ విషయంలో ధోనీకి, ఇప్పుడు కేసు వేసిన మిహిర్ దివాకర్, సౌమ్యాదాస్ మధ్య వివాదం మొదలైంది. విషయం ఏమిటంటే ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెట్ పేరిట దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2017లో సదరు సంస్థ ధోనీతో ఒప్పందం చేసుకుంది. అనంతరం అగ్రిమెంట్ లో భాగంగా తనకి రావల్సిన రాయల్టీని చెల్లించడం లేదని ధోనీ అభియోగం.


తాను ఎన్నిసార్లు మాట్లాడినా వారిలో స్పందన లేదని ధోనీ అంటున్నాడు. దీంతో విసుగెత్తిన ధోనీ వారితో అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాడు. అంతేకాదు పలుమార్లు లీగల్ నోటీసులు పంపించాడు. అయినా స్పందన లేకపోవడంతో రాంచీ కోర్టులో రూ.15 కోట్లు నష్టపరిహారంగా ఇప్పించమని, పరువు నష్టం కలిగించారంటూ క్రిమినల్ కేసు వేశాడు.

ఈ విషయాన్ని ధోనీ తరఫు న్యాయవాది మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాడు. అంతేకాదు అగ్రిమెంట్ రద్దు చేసుకున్న తర్వాత కూడా దేశవ్యాప్తంగా ధోనీ పేరిట క్రికెట్ అకాడమీలను ప్రారంభించారని న్యాయవాది ఆరోపించారు.

దీంతో ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెట్ యజమానులైన దివాకర్, సౌమ్యలు రంగంలోకి దిగారు. ధోనీ కేసు వేయడంతో తాము నెలకొల్పిన సంస్థలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, తద్వారా తమకు డ్యామేజి జరిగిందని, ధోనీ చెబుతున్నదంతా అసత్యమని వారు పేర్కొన్నారు. ఇలాంటి  తప్పుడు ఆరోపణలతో తమ పరువుకు భంగం కలిగించాడని వారు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.

Related News

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Big Stories

×